Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపో-లారీ ఢీ.. ఎనిమిది మంది దుర్మరణం..

Raod Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో..

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపో-లారీ ఢీ.. ఎనిమిది మంది దుర్మరణం..
Road Accident
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Mar 28, 2021 | 7:13 AM

Road Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలిలో మృతదేహాలను వాహనాల నుంచి కిందకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులంతా తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also read:

Kurnool Airport: కర్నూలు ప్రజల కల సాకారమైంది.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమాన సర్వీస్ నేటి నుంచే ప్రారంభం..

Child Ghost: రోడ్డుపై పరుగులు తీసిన ‘దెయ్యం’.. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసు.. చివరికి ఏం జరిగిందంటే..

Nagarjuna Sagar By Election: ఓవైపు గర్జిస్తున్న జానారెడ్డి.. మరోవైపు ‘వెయిట్’ అంటున్న టీఆర్ఎస్, బీజేపీలు.. సాగర్‌లో ఏం జరుగుతోంది?..

Latest Articles