హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం.. మున్సిపల్ చైర్మన్గా రమేష్ ఎన్నిక
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్ను హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటీగా జై బాలయ్య అంటూ

హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్ను హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటీగా జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్ల నినాదాలు చేశారు.
హిందూపుర్ మున్సిపాలిటీ చైర్మన్ మొదటి నుంచి ఉత్కంఠ రేపింది. టీడీపీ నుంచి రమేష్, వైసీపీ నుంచి లక్ష్మి పోటీలో ఉన్నారు. చివరకు రమేష్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బాయికాట్ చేశారు. ఎన్నిక జరుగుతున్న సమయంలో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.
అయితే హిందూపురం మున్సిపాలిటీలో క్యాంప్ పాలిటిక్స్ కాక రేపాయి. వైసీపీ నుంచి గెలిచి చైర్పర్సన్ అయిన ఇంద్రజ.. రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. ఫిబ్రవరి 3న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో టీడీపీ అలెర్ట్ అయింది. 20మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపునకు తరలించడంతో హిందూపురం రాజకీయాలు వేడెక్కాయి.
గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో వైసీపీ 30 గెలుచుకోగా.. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితం అయింది. బీజేపీ, ఎంఐఎం చెరో ఒక్కో వార్డు గెలుచుకున్నాయి. అయితే.. కూటమి అధికారంలోకి వచ్చాక 14మంది వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే.. ఫిబ్రవరి 3న హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుండడంతో కౌన్సిలర్లు చేజారకుండా టీడీపీ క్యాంపు రాజకీయాలకు చేపట్టింది.