AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Tribal Gurukula Admissions: గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 8వతరగతి, ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. అర్హులైన విద్యార్ధులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం ఏడు గిరిజన గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు..

AP Tribal Gurukula Admissions: గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..
AP Tribal Gurukula Admissions
Srilakshmi C
|

Updated on: Feb 03, 2025 | 11:39 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అర్హులైన విద్యార్ధులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడు గిరిజన గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ కోర్సులో 300 సీట్లు, ఇంటర్ బైపీసీ కోర్సులో 300 సీట్ల చొప్పున ఉన్నాయి. ఇక 8వ తరగతిలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 2, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తారు.

ఏయే గిరిజన విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఉన్నాయంటే..

  • కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విశాఖపట్నం
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం (జోగింపేట)
  • కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విస్సన్నపేట
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీకాళహస్తి
  • స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీశైలం డ్యామ్
  • కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, తనకల్లు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఏడో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ఇక ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందే విద్యార్ధులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి. 8వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు రెండింటికీ ప్రవేశ పరీక్ష ఉంటుంది.

రాత పరీక్ష ఎలాగుంటుందంటే..

ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు 7వ తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. తెలుగులో 10 మార్కులు, ఇంగ్లిష్‌లో 10 మార్కులు, హిందీలో 10 మార్కులు, మ్యాథ్స్‌లో 10 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌లో 15 మార్కులు, బయోసైన్స్‌ లో 15 మార్కులు, సోషల్‌ స్టడీస్‌లో 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు  పరీక్ష జరుగుతుంది. అలాగే ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు పదో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌లో 20 మార్కులు, మ్యాథ్స్‌లో 40 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌లో 20 మార్కులు, బయోసైన్స్‌ లో 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 3, 2025.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 02, 2025.
  • హాల్ టికెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: మార్చి 04, 2025.
  • ప్రవేశ పరీక్ష తేదీ: మార్చి 9, 2025.
  • మెరిట్ జాబితా వెల్లడించే తేదీ: మార్చి 25, 2025.
  • మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహించే తేదీ: ఏప్రిల్ 11, 2025.
  • రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించే తేదీ: ఏప్రిల్ 21, 2025.

ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి