AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పెన్షన్లు, తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడు గంటలపాటు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. మహానాడు సహా 12 అంశాలపై సమావేశంలో చర్చించి... కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వితంతు పెన్షన్లు, మూడు గ్యాస్‌ సిలిండర్ల పథకం.. తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు.

Andhra News: పెన్షన్లు, తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Cm Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: May 14, 2025 | 9:22 PM

Share

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్‌ సింధూర్‌కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి, ఆపరేషన్‌ సింధూర్‌లో వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలిపారు.16,17,18 తేదీల్లో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు. తొలి రెండు రోజులు 23 వేల మందికి ఆహ్వానించాలని నిర్ణయించారు. చివరిరోజు గ్రామ అధ్యక్షుల వరకు 50వేల మందికి ఆహ్వానం పలకనున్నారు. కనీవిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పొలిట్‌బ్యూరో సభ్యులు వెల్లడించారు.

జూన్‌ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. మూడు గ్యాస్‌ సిలిండర్లకు ముందే డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే జూన్‌ 12న స్కూళ్లు తెరిచేలోపు తల్లికి వందనం అందేలా చూడాలన్నారు. కేంద్రం ఇన్‌స్టాల్‌మెంట్‌తో కలిపి అన్నదాత సుఖీభవ కూడా అందించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే మూడు టర్మ్‌లు మండలాధ్యక్షులుగా ఉన్నవారిని.. అదే పదవిలో కొనసాగించకూడదని సమావేశంలో నిర్ణయించారు. అర్హతని బట్టి ప్రమోషన్‌ ఉండాలని లేదంటే వేరే కమిటీలోకి తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు కూడా పొలిట్‌బ్యూరో సభ్యులు తెలిపారు.

పొలిట్‌బ్యూరో సమావేశానికి ముందు మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు మంత్రి లోకేష్‌. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మహానాడుకు వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు లోకేష్‌ దిశానిర్దేశం చేశారు.

ఇక మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో.. మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపైనా సమావేశంలో చర్చించారు. మొత్తంగా… మహానాడు సహా 12 అంశాలపై చర్చించిన పొలిట్‌బ్యూరో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..