కర్నూలులో భగ్గుమన్న పాత పగలు.. టీడీపీ నేత దారుణ హత్య
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో సంజన్న నివసిస్తున్న షరీఫ్ నగర్లోని గూడేకల్లు అల్లిపీర స్వామి మందిరానికి ప్రార్థన చేసుకోవడం కోసం వెళ్లేవాడు. బైక్ మందిరం ముందర ఆపి లోపలికి వెళ్తుండగా హఠాత్తుగా కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు.

కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు తండ్రి టిడిపి నేత సంజన్నను గుర్తు తెలియని దుండగులు హతమార్చాడు. ఈ ఘటన శుక్రవారం(మార్చి 14) రాత్రి నగరంలోని షరీఫ్ నగర్ లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో కలకలం రేగింది. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
శుక్రవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో సంజన్న నివసిస్తున్న షరీఫ్ నగర్లోని గూడేకల్లు అల్లిపీర స్వామి మందిరానికి ప్రార్థన చేసుకోవడం కోసం వెళ్లేవాడు. బైక్ మందిరం ముందర ఆపి లోపలికి వెళ్తుండగా హఠాత్తుగా కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. దుండగులు పథకం ప్రకారం ముందస్తుగానే ప్రణాళిక రచించి ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనక పాత కక్షలు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సంజన భార్య సిపిఎం నుంచి గతంలో కార్పొరేటర్ గా గెలుపొందారు. సంజన్న కుమారుడు జయరాం 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరింది సంజన్న కుటుంబం. 30వ డివిజన్లో అధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చాలా ఏళ్లుగా వడ్డె రామాంజనేయులు, సంజన్న కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హత్యకు ఒడిగట్టి ఉండవచ్చంటున్నారు స్థానికులు. కాగా మృతదేహాన్ని కర్నూలు జిజిహెచ్ కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్నరి క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




