Maganti Ramji: టీడీపీలో విషాదం.. ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత
Maganti Ramji: ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (38) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఏలూరు..
Maganti Ramji: ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (38) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మరణించారు. కాగా, రాంజీ శరీర అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని నివాసానికి తరలించనున్నారు.
కాగా, రాంజీ అనారోగ్యానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు. అయితే మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇక ఆయన మృతికి సంబంధించి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఏలూరు మాజీ పార్లిమెంట్ సభ్యులు శ్రీ మాగంటి బాబు గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువనేత, మాజీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీ మాగంటి రాంజీ అకాల మరణం ఏంతో బాధాకరం.పార్టీ ఒక క్రియాశీలక, ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నాయకుడని కోల్పోయింది. ఆయన మృతికి అశ్రునివాళి ఘటిస్తున్నాం. pic.twitter.com/SP9jmPfAEc
— iTDP Official (@iTDP_Official) March 7, 2021
లోకేష్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక వినపడదు.మాగంటి రాంజీ మనకి దూరం అయిపోయాడు.తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడా నీ మరణం పార్టీకీ,నాకూ తీరని లోటు. (1/2) pic.twitter.com/u7GCze3W45
— Lokesh Nara (@naralokesh) March 7, 2021
Road Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. పెళ్లై ఐదు నెలలు గడవకముందే అనంతలోకాలకు..
భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!