Chandrababu: ఎందుకింత ఆలస్యం..ఏపీ సర్కార్‌పై చర్యలు తీసుకోండి.. మోడీ సర్కార్‌కు చంద్రబాబు ఘాటు లేఖ..

Polavaram Project: 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదాతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది.

Chandrababu: ఎందుకింత ఆలస్యం..ఏపీ సర్కార్‌పై చర్యలు తీసుకోండి.. మోడీ సర్కార్‌కు చంద్రబాబు ఘాటు లేఖ..
Chandrababu
Follow us

|

Updated on: Jun 29, 2022 | 2:51 PM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జలశక్తి మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి సహకరించాలి.. పోలవరం పై కేంద్రం, PPA రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని లేఖలో వెల్లడించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదాతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది. 2014లో కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఎపికి బదిలీ చేయడం ప్రాజెక్టుకు మేలు జరిగిందని వెల్లడించారు. నీతి-అయోగ్ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అద్భుతమైన పురోగతిని నమోదు చేయడంలో ఎంతో సహాయపడిందని… పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి. నదుల అనుసంధానానికి ఆధారమన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని టీడీపీ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 71 శాతం పూర్తి చేసిందని.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తన ఉద్దేశ్య పూర్వక, అసమర్థ నిర్ణయాల ద్వారా పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని ఫైర్‌ అయ్యారు.

వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు తలచుకుంటే నాకు చాలా బాధగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేతృత్వంలోని అధికారం చేపట్టిన నాటి నుంచి స్వార్థ ప్రయోజనాలతో ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రాధాన్యతలతో ముందుకెళుతోందని లేఖలో తెలిపారు.

ఏపీ వార్తల కోసం