AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లి విక్రయంలో తొక్కిసలాట !

ఉల్లిపాయ కొనుగోళ్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. బంగారంలా మారిపోయిన ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లికోసం వెళ్లిన మహిళలు క్యూలైన్లలో కొట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న మహిళలు, వృద్దులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇదంతా ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం ఏపీలో నెలకొన్న ఉల్లి కష్టాలు. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు రాయితీపై అందజేస్తోంది. దీంతో తెల్లవారుజాము 3-4 గంటల నుంచే […]

ఉల్లి విక్రయంలో తొక్కిసలాట !
Pardhasaradhi Peri
| Edited By: Nikhil|

Updated on: Dec 07, 2019 | 5:45 PM

Share

ఉల్లిపాయ కొనుగోళ్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. బంగారంలా మారిపోయిన ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లికోసం వెళ్లిన మహిళలు క్యూలైన్లలో కొట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న మహిళలు, వృద్దులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇదంతా ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం ఏపీలో నెలకొన్న ఉల్లి కష్టాలు.

ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు రాయితీపై అందజేస్తోంది. దీంతో తెల్లవారుజాము 3-4 గంటల నుంచే ప్రజలు దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక కేజీ చొప్పున ఇరవై ఐదు రూపాయలకు అందజేస్తున్నారు.. బయట మార్కెట్ లో దాదాపు రూ. 200లకు చేరిన ఉల్లిపాయలు రైతుబజార్లలో 25 రూపాయలకే ప్రభుత్వం ఇవ్వటంతో ..వందల సంఖ్యలో జనాలు బారులు తీరుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, అధికారులు తగినంత ఉల్లి సరఫరా చేయకపోవడంతో పలుచోట్ల వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్యూ లైన్లను నియంత్రించేందుకు ప్రయత్నించారు. వారిని అదుపు చేయలేక అధికారులు గేట్లకు తాళాలు వేసే ప్రయత్నం చేశారు. లబ్ధిదారులంతా ఒక్కసారిగా దూసుకురావటంతో తొక్కిసలాట నెలకొంది. పలువురు స్పృహా కొల్పోయారు.