AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు బంద్..

దాదాపు 56 రోజుల లాక్ డౌన్ తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు ఈ ఉదయం నుంచి రోడ్డెక్కాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో మాత్రం బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. కేవలం చిలకలూరిపేట – మాచర్ల మధ్య 3 సర్వీసులను నడిపేందుకు అధికారులు అనుమతి ఇవ్వగా.. మిగతా డిపోలలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. గుంటూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉండటం వల్ల బస్సులను నిలిపేశారు. బాపట్ల, […]

గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు బంద్..
Ravi Kiran
|

Updated on: May 21, 2020 | 9:06 PM

Share

దాదాపు 56 రోజుల లాక్ డౌన్ తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు ఈ ఉదయం నుంచి రోడ్డెక్కాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో మాత్రం బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. కేవలం చిలకలూరిపేట – మాచర్ల మధ్య 3 సర్వీసులను నడిపేందుకు అధికారులు అనుమతి ఇవ్వగా.. మిగతా డిపోలలో బస్సు సర్వీసులను రద్దు చేశారు.

గుంటూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉండటం వల్ల బస్సులను నిలిపేశారు. బాపట్ల, రేపల్లె ప్రాంతాలు గ్రీన్ జోన్లలో ఉన్నా అక్కడికి కూడా బస్సులు తిప్పడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. కాగా, గుంటూరు, నరసరావుపేటలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక గుంటూరు జిల్లలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపులు ఉన్నాయి.

Read This: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వాహనమిత్ర అమలుకు ఉత్తర్వులు జారీ..