పెద్ద పులులు, చిరుత పులులు తరచుగా మృతి చెందుతూ ఉండటం పట్ల జంతు ప్రేమికులు బాధ వర్ణనాతీతం. యాక్సిడెంట్లోనో, ఇతర కారణాలతో ఇటీవల కాలంలోనే పదికి పైగా చిరుతలు మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ జోన్ ఫారెస్ట్లో చిరుత పులి, పెద్ద పులిలు తరచు మృతి చెందుతున్నడంతో జంతు ప్రేమికులు కలవరపడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లుటి గూడెం వద్ద కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని సుమారు సంవత్సరం వయసున్న ఆడ చిరుత మృతి చెందినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు.
మృతి చెందిన చిరుత పులి మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు పంచనామా నిర్వహించి, ఖననం చేశారు. నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వుడు ఫారెస్ట్లో వాహనాలు పరిమితికిమించిన వేగంతో వెళ్తున్నాయని తెలిపారు. 30 కిలోమీటర్ల స్పీడుకు మించి వెళ్లకూడదని ఫారెస్ట్లో బోర్డులు ఏర్పాటు చేసినా వాహనదారులు పట్టించుకోవడంలేదని అతివేగంతో వెళ్లడం కారణంగానే వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్నిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అయితే గత ఆరు సంవత్సరాల నుంచి ఆత్మకూరు నంద్యాల అటవీ డివిజన్ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వున్ ఫారెస్ట్లో చిరుత పులులు, పెద్ద పులులు రోడ్డు ప్రమాదంతో పాటు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నట్లు గుర్తించారు. ఇప్పటి దాకా సుమారు 10 చిరుతలు మరణించి ఉంటాయని వాటి వివరాలు అందజేశారు.
ఇలా రోడ్డు ప్రమాదంలో మరియు అనుమానాస్పదంగా చిరుతలు పెద్దపులులు మృతి చెందుతూ ఉండడంతో విలువైన జంతు సంపదలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..