Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: ఏకాంతంగా ఉన్న లవర్స్ వద్దకు వెళ్లిన హోంగార్డు.. ఆపై వారిని బెదిరించి..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఓ యువతిపై హోంగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో.. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Vizianagaram: ఏకాంతంగా ఉన్న లవర్స్ వద్దకు వెళ్లిన హోంగార్డు.. ఆపై వారిని బెదిరించి..
Lovers (Representative image)
Ram Naramaneni
|

Updated on: Aug 01, 2024 | 8:58 AM

Share

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల్లిమర్ల మండలంలో ఓ యువతిపై పోలీసు హోంగార్డు అత్యాచారానికి ఒడిగట్టాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి కంప్లైంట్ చేయడంతో.. హోంగార్డును అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి… బొండపల్లి పోలీసుస్టేషన్‌లో డ్యూటీ చేస్తున్న హోంగార్డు మొయిద సురేశ్‌ మంగళవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. దారిలో కొండకరకం దగ్గర్లో..  ఓ లవ్ కపుల్ కనిపించడంతో వారి వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను ఎస్సైని అని, ఇద్దరిపై కేసు బుక్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ప్రియుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.

ఆ తర్వాత హోంగార్డు సురేశ్‌ ఆ యువతిని ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిస్తానని నమ్మించాడు. ఆపై బైకుపై రామతీర్థం సమీపంలోని చంపావతి నది ఒడ్డునున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తిరిగి ఆమెను రామతీర్థం సర్కిల్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు. బాధితురాలి కంప్లైంట్ చేయడంతో.. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేశ్‌ను అరెస్టు చేశామని.. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..