Prakasam District: హాస్టల్ బాత్రూమ్లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని
కొత్తపట్నం మండలం మోటుమాల కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో బాత్రూంలో బాలిక ప్రసవించింది. అయితే పసికందు చనిపోయింది. బాలికను లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రకాశం జిల్లా మోటుమాల కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని బాత్రూమ్లో ప్రసవించింది. అయితే పసికందు ప్రాణాలు కోల్పోయింది. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థిని రెండు నెలల నుంచి మోటుమాల వద్ద ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుందని అధికారులు తెలిపారు. విద్యాలయంలో చేరినప్పటికే బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

