మాజీ మంత్రిపై కీలక ఆరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతులు..

మాజీ మంత్రి విడదల రజిని విషయంలో స్పీడ్‌పెంచారు పసుమర్రు రైతులు. నిన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని కలిసిన రైతులు.. ఇవాళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. విడదల రజినిపై చర్యలు తీసుకొని .. న్యాయం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు పసుమర్రు రైతులు. జగనన్న కాలనీ పేరుమీద తమ గ్రామంలో 200 ఎకరాలు సేకరించారని.. తమ నుంచి కొన్న ఒక్కో ఎకరానికి రెండున్నర లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు రైతులు.

మాజీ మంత్రిపై కీలక ఆరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతులు..
Formers Land
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 21, 2024 | 11:30 PM

మాజీ మంత్రి విడదల రజిని విషయంలో స్పీడ్‌పెంచారు పసుమర్రు రైతులు. నిన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని కలిసిన రైతులు.. ఇవాళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. విడదల రజినిపై చర్యలు తీసుకొని .. న్యాయం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు పసుమర్రు రైతులు. జగనన్న కాలనీ పేరుమీద తమ గ్రామంలో 200 ఎకరాలు సేకరించారని.. తమ నుంచి కొన్న ఒక్కో ఎకరానికి రెండున్నర లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు రైతులు. ఫేజ్‌ల వారిగా భూమిని కొన్న రజిని ఒక్క ఫస్ట్‌ ఫేజ్‌లోనే రైతుల నుంచి కోటి రూపాయలు కలక్ట్ చేశారని ఆరోపించారు. రజిని, ఆమె పీఏ, బంధువు గోపి డబ్బు వసూలు చేశారని చెప్పారు పసుమర్రు రైతులు.

మధ్యవర్తిగా పసుమర్రుకి చెందిన ఉమమహేశ్వరరావు ద్వారా చెక్కులు, క్యాష్ తీసుకున్నారని వివరించారు. కేసుకు సంబంధించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇదే వ్యవహారంపై ముందుగా చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పుల్లారావును కలిశారు పసుమర్రు రైతులు. ఇళ్ల స్థలాల పేరుమీద తమనుంచి సుమారు రూ.10కోట్లు వసూలు చేశారని.. తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని ఎమ్మెల్యే పుల్లారావుని వేడుకున్నారు రైతులు. గతంలో ఆమెకు భయపడి కంప్లైంట్ చేయలేకపోయామని కూడా చెప్పుకొచ్చారు రైతులు. జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పసుమర్రు రైతులకు న్యాయం చేస్తానని మాటిచ్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?
మీ రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?
హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఘనస్వాగతం
హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఘనస్వాగతం
భారత్‌లో దుమ్మురేపుతున్న బడ్జెట్ కార్లు.. ది బెస్ట్ ఇవే..!
భారత్‌లో దుమ్మురేపుతున్న బడ్జెట్ కార్లు.. ది బెస్ట్ ఇవే..!
రామ, రావణుడితో పూజను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..
రామ, రావణుడితో పూజను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..
దివిలో చంద్రునికే సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా సిజ్లింగ్ లుక్స్..
దివిలో చంద్రునికే సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా సిజ్లింగ్ లుక్స్..
మెరుపులు కురిపిస్తున్న దేవర.. మిగిలిన సినిమాల గురించి డిస్కషన్‌.!
మెరుపులు కురిపిస్తున్న దేవర.. మిగిలిన సినిమాల గురించి డిస్కషన్‌.!
గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
హెల్మెట్‌తో ఎల్‌బీడబ్ల్యూ చేయోచ్చు: రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
హెల్మెట్‌తో ఎల్‌బీడబ్ల్యూ చేయోచ్చు: రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!
ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!
అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?
అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?