AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు లారీలు ఢీ.. నలుగురి సజీవదహనం! ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..

పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పినప్పటికీ, క్యాబిన్‌లలో చిక్కుకున్న వారిని రక్షించలేకపోయారు.

రెండు లారీలు ఢీ.. నలుగురి సజీవదహనం! ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..
Palnadu Road Accident
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 8:55 PM

Share

అప్పుడప్పుడే తెల్లవారుతోంది.. జాతీయ రహదారిపై వాహనాలు దూసుకుపోతున్నాయి. అంతలోనే ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద డ్రైవర్ తప్పిదంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో నలుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి మృతదేహాలను మార్చురీకి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నుండి గుంటూరు వైపు నాపరాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోయపాలెం వద్దకు వచ్చే సరికి ఎదురుగా ఉన్న లారీ కనిపించింది. దీంతో డ్రైవర్ ప్రమాదాన్ని నివారించేందుకు ఒక్కసారిగా రైట్ సైడ్‌కు లారీని తిప్పాడు. దీంతో లారీ అదుపుతప్పి డివైడర్ ను డీ కొట్టి అటు వైపు వస్తున్న లారీని ఎదురుగా ఢీ కొట్టింది. గుంటూరు నుండి చెన్నై వైపు పేపర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని నాపరాళ్ల లోడ్ తో వస్తున్న లారీ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో డ్రైవర్లతో పాటు క్లీనర్స్ కూడా క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. కిందకు దిగే అవకాశం లేకపోవడం మరొకవైపు డిజీల్ చిమ్మడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నలుగురు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం గురించి తెలిసి రోడ్డుపైకి వచ్చిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే క్యాబిన్స్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు స్థానికులు చూస్తుండగానే మంటల్లో కాలిపోయారు. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వేగంగా వస్తున్న నాపరాళ్ల లారీ డ్రైవర్ అదుపుతప్పడంతోనే ఘోర ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. నాలుగు మృతదేహాలను మార్చురికీ తరలించారు. లారీ యజమానులను గుర్తించి వారిచ్చిన సమాచారంతో మృతుల వివరాలు గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!