My Home Group: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మై హోం గ్రూప్.. ప్రభుత్వ ఆసుపత్రికి పిల్లల వైద్య పరికరాలు అందజేత

అపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ముందుకు వచ్చే మై హోం గ్రూప్.. మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని సాయం చేసేందుకు సిద్ధమైంది

My Home Group: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మై హోం గ్రూప్.. ప్రభుత్వ ఆసుపత్రికి పిల్లల వైద్య పరికరాలు అందజేత
My Home Group Expressed Generosity
Follow us

|

Updated on: Jul 12, 2021 | 9:40 PM

My Home Group Expressed Generosity: అపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ముందుకు వచ్చే మై హోం గ్రూప్.. మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని సాయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మై హోమ్ గ్రూప్ యాజమాన్యం భారీ విరాళం అందించింది. రూ. 51లక్షల 15వేలు విలువైన పీడియాట్రిక్ వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, చిన్న పిల్లలకు అవసరమైన ఇతర వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కు అందించింది.

మై హోమ్ గ్రూప్‌లో భాగమైన బనగానపల్లె సమీపంలోని మహా సిమెంట్ యూనిట్ హెడ్ గురివిరెడ్డి, హెచ్ ఆర్ హెడ్ శివ ప్రసాద్ ఇతర సిబ్బంది కలెక్టర్ వీర పాండ్యన్‌కు చిన్న పిల్లలకు కావల్సిన వైద్య పరికరాలను అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో అందించామని మై హోమ్ గ్రూప్ యాజమాన్యం తెలిపింది. ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటామని స్పష్టం చేశారు. మై హోమ్ గ్రూప్ యాజమాన్యంను కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అభినందించారు. వీరిలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇతర పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Read Also… Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. జలమయం అయిన పలు ప్రాంతాలు..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..