Dhulipalla Narendra: ధూళిపాళ్ల మెడకు కాకినాడ బోటు రచ్చ.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్రగ్స్‌కు సంబంధించి ప్రభుత్వంపై చేసిన విమర్శలు.. ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాపై చేసిన విమర్శలకు..

Dhulipalla Narendra: ధూళిపాళ్ల మెడకు కాకినాడ బోటు రచ్చ.. నోటీసులు జారీ చేసిన పోలీసులు
Dhulipalla Narendra
Follow us

|

Updated on: Oct 08, 2021 | 9:34 AM

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్రగ్స్‌కు సంబంధించి ప్రభుత్వంపై చేసిన విమర్శలు.. ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాపై చేసిన విమర్శలకు సంబంధించి విచారణకు వచ్చి ఆధారాలివ్వాలని నోటీసులిచ్చేందుకు నరేంద్ర ఇంటికి వచ్చారు కాకినాడ పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలోని ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి చేరుకున్నారు కాకినాడ పోలీసులు. కాకినాడ పోర్టులో తగలబడిన బోటులో డ్రగ్స్‌ ఉన్నాయంటూ అనుమానం వ్యక్తం చేశారు నరేంద్ర. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. విచారణకు వచ్చి ఆధారాలివ్వాలంటూ నోటీసులిచ్చారు.

ధూళిపాళ్ల నరేంద్ర ఏం మాట్లాడారంటే..

‘‘కాకినాడ సముద్రతీరంలో ఒక బోటు తగలబడింది. దాని నుంచి వచ్చిన వాసన భిన్నంగా ఉందని.. అది సాధారణ బోటు కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే చేపల వేటకు వెళ్లిన వ్యక్తి వల వేస్తే ఆ బోటు తిరగబడిందని, సదరు వ్యక్తి చనిపోయాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. కాకినాడ తీరంలో బోటు తగలబడటంపై పోలీసులు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. దాన్ని చూసిన వారిని ఎందుకు విచారించలేదు?’ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం విమర్శలు చేశారు. పోలీసులు మాత్రం దానిపై కనీస విచారణ జరపకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదని మాట్లాడటం చూస్తే.. ఈ దందాలో వారి పాత్రేమిటో స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

IPL 2021 RCB vs DC Live Streaming: బెంగళూరు వర్సెస్ ముంబై.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసా..

Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..