Janasena: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించిన జనసైనికులు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించారు జనసేన నాయకుడు అనుకుల రమేష్.

Janasena: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించిన జనసైనికులు
Janasena Attack On Perni Na
Follow us

|

Updated on: Sep 30, 2021 | 1:58 PM

Janasena – Perni Nani: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించారు జనసేన నాయకుడు అనుకుల రమేష్. పార్టీ జెండా చేతపట్టుకొని కాన్వాయ్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అతడ్ని హుటాహుటీన పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పేర్ని నాని ఖబడ్దార్ అంటూ జనసైనికులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ అక్విడేట్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్నినాని పరిశీలించడానికి వచ్చారు.

జిల్లాలో ప్రాజెక్టులకు వచ్చిన వరదలు పరిశీలించే క్రమంలో యర్రకాలువ యనమదుర్రు డ్రయిన్ లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా నిడదోవోలు, తణుకు పరిసర ప్రాంత రైతులు వరదల వల్ల అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి అన్నారు. మాజీ సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 10, 12, వేల కెపాసిటీ ఉన్న జలాశయాన్ని 20 వేలకు పెంచారని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్బంగా చెప్పారు. దువ్వలో కొత్త రెగ్యులేటర్ సమీప భవిష్యత్ లోనే ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆదివారం ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మెలా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 800 థియేటర్లల్లో సినిమాలు ఆడుతున్నాయని పేర్ని నాని చెప్పారు. తెలంగాణలో 413 మాత్రమే నడుస్తున్నాయన్నారు. లవ్ స్టోరీ సినిమాకు ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నారు.

కేసీఆర్ ను తిట్టే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు లేదని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. సాయితేజ్ ప్రమాదం గురించి పోలీసులు చెప్పిందే మీడియా చెప్పిందని పేర్ని నాని తెలిపారు. దీనిపై పవన్‌ తెలంగాణ పోలీసులను ప్రశ్నించాలని సూచించారు. సిని పరిశ్రమకు ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని నాని తెలిపారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్‌ వస్తుందని నాని తెలిపారు. పవన్ కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారంటూ పేర్కొన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదంటూ హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు పేర్ని నానిపై మండిపడుతున్నారు.

Janasena Perni Nani

Janasena Perni Nani

Read also: China’s Power Crisis: చైనాని చీకటి చేస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేని స్థితి

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు