AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సర్కార్ మరో అద్భుతం..”జగనన్న వసతి దీవెన”..ఏకంగా 11.87 లక్షల మంది విద్యార్థులకు..!

రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్.. మరో అద్భుత కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ విజయనగరంలో పర్యటించనున్న సీఎం జగన్.. “జగనన్న వసతి దీవెన” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అధికారులు, వైసీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ తొలిసారిగా విజయనగరం జిల్లాకు వస్తుండటంతో భారీ జనసమీకరణకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విద్యార్థుల చదువుకు ఎట్టి పరిస్థితుల్లో […]

ఏపీ సర్కార్ మరో అద్భుతం..జగనన్న వసతి దీవెన..ఏకంగా 11.87 లక్షల మంది విద్యార్థులకు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2020 | 6:44 AM

Share

రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్.. మరో అద్భుత కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ విజయనగరంలో పర్యటించనున్న సీఎం జగన్.. “జగనన్న వసతి దీవెన” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అధికారులు, వైసీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ తొలిసారిగా విజయనగరం జిల్లాకు వస్తుండటంతో భారీ జనసమీకరణకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

విద్యార్థుల చదువుకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగకూడదన్న ఉద్దేశ్యంతో.. నవరత్నాల్లో ఒకటైన “జగనన్న వసతి దీవెన” కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11,87,904 మందికి ఏడాదికి 20 వేల రూపాయలు ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాలో 58,723 మందికి 20 వేల చొప్పున అందజేయనున్నారు. ఉన్నత చదువులు చదువుకొనే విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేల రూపాయలు ఇస్తామని గతంలోనే జగన్‌ ప్రకటించారు.

ఈ కార్యక్రమానంతరం.. మహిళలకు తగిన భద్రత, సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన దిశా మహిళా పోలీస్‌ స్టేషన్‌ను కూడా ప్రారంభించనున్నారు. సీఎం టూర్‌ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు.

విజయనగరం టూర్.. రూట్ మ్యాప్

సీఎం జగన్‌ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌లో విజయనగరానికి ఉదయం 11.30 నిమిషాలకు చేరుకుంటారు. అనంతరం అయ్యోధ్య మైదానంలో “జగనన్న వసతి దీవెన” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన దిశా మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు