AP Inter: “ఏపీలో ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే.. అలా చేస్తే చర్యలు తప్పవు”
AP Inter Admissions: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లను ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లను ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నామన్న ఆయన.. ఆఫ్లైన్లో అడ్మిషన్లను తీసుకోవద్దని తల్లిదండ్రులను కోరారు.
”విద్యార్ధులందరూ కూడా ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్ ద్వారానే పొందాలి. ఇప్పటిదాకా అడ్మిషన్ల విషయంలో ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయితే ఇప్పటికే కొన్ని కాలేజీలు ఆఫ్లైన్ ద్వారా అడ్మిషన్లను చేపట్టాయి. వాటిని ఇంటర్ బోర్డు పరిగణలోకి తీసుకోదు. తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలలో ఆఫ్లైన్ అడ్మిషన్లు పిల్లలకు తీసుకుంటే నష్టపోతారు. Apbie.gov.in ద్వారా గుర్తింపు పొందిన కాలేజీలలో మాత్రమే అడ్మిషన్లు నమోదు చేసుకోవాలి. బోర్డు అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
కాగా, కరోనా కారణంగా వాయిదాపడిన ఈ ఏడాది విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఆగష్టు 16 నుంచి స్కూల్స్ రీ-ఓపెన్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అటు ఈ నెల 12వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్ధులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఆకడిమిక్ క్యాలెండర్ను కూడా సిద్దం చేసిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి:
మార్కెట్లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!
ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..
మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!