Andhra Pradesh: తిరుపతి ఎస్వీ జూలో విషాదం.. మూడేళ్ల బాలుడు దుర్మరణం..
తిరుపతి ఎస్వీ జూ పార్క్లో విషాదం జరిగింది. బ్యాటరీ వాహనం ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతి రాయల్నగర్కు చెందిన మనోజ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య సుష్మ తిరుపతిలో ఉంటోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు. స్కూల్కు వేసవి సెలవులు కావడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడి కుమారుడిని జూ పార్కుకు తీసుకెళ్లింది.

తిరుపతి ఎస్వీ జూ పార్క్లో విషాదం జరిగింది. బ్యాటరీ వాహనం ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతి రాయల్నగర్కు చెందిన మనోజ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య సుష్మ తిరుపతిలో ఉంటోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు. స్కూల్కు వేసవి సెలవులు కావడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడి కుమారుడిని జూ పార్కుకు తీసుకెళ్లింది.
జూపార్కులో ప్రణవ్ నారాయణను ఓ చేత్తో.. మరో చేత్తో మేనల్లుడిని పట్టుకుని నడిచి వెళుతుండగా.. అదే సమయంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. బ్యాటరీ వాహన చక్రాలు బాలుడిపైకి ఎక్కేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన జూపార్కు ఉద్యోగి బాలుడిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు.
అప్పటి వరకు తన ముందే ఉన్న కుమారుడు చనిపోయాడని తెలియడంతో తల్లి బోరున విలపించింది తల్లి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బ్యాటరీ వాహన డ్రైవర్ అజాగ్రత్త, వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
