AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భార్య మాయ ఫోన్ మాయలో పడింది.. అది చూసి ఇంటికొచ్చిన భర్త ఏం చేశాడో తెలిస్తే

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యనే కడతేర్చేలా చేసింది. విచక్షణ కోల్పోయిన భర్త స్క్రూ డ్రైవర్‌తో పొడిచి భార్యను అంతమొందించాడు. దీంతో అభం శుభం తెలియని నాలుగు నెలలు చిన్నారి తల్లి లేని అనాధగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

Andhra: భార్య మాయ ఫోన్ మాయలో పడింది.. అది చూసి ఇంటికొచ్చిన భర్త ఏం చేశాడో తెలిస్తే
Vizag Incident
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Dec 25, 2025 | 10:50 AM

Share

అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేష్.. తన భార్య మాయతో కలిసి 8 నెలల క్రితం పొట్టకూటి కోసం అనకాపల్లి జిల్లాకు వచ్చేశాడు. ఎలమంచిలిలో ఓ స్క్రాప్ దుకాణాన్ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు రాకేష్. అక్కడే భార్య, నాలుగు నెలల చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నాడు. మాయ 12 ఏళ్ల పెద్ద కుమార్తె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. అయితే అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో సెల్‌ఫోన్ కలహాన్ని నింపింది. మాయ.. సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుందని గమనించిన రాకేష్ పలుమార్లు ప్రశ్నించాడు. ఈ విషయంలో గత మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం కూడా రాకేష్ బయటకి వెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి భార్య మాయ.. ఫోన్ మాట్లాడుతూ లీనమై ఉంది. వెంటనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాకేష్.. ఆమెను ప్రశ్నించాడు. మాట మాట పెరిగింది.

దీంతో మాయ తలను గోడకేసి కొట్టాడు రాకేష్. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పక్కనే ఉన్న 4నెలల చిన్నారిని స్థానికుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య మాయ ఫోన్‌లో మాట్లాడుతోందని గుర్తించిన రాకేష్.. అనుమానంతో హత్య చేశాడని ఎలమంచిలి సిఐ ధనుంజయ తెలిపారు.

తల్లికోసం..

మాయకు నాలుగు నెలల చిన్నారి ఉంది. తల్లి కోల్పోవడంతో చిన్నారిని సంరక్షిస్తున్నారు నర్సులు, ఐసిడిఎస్ సిబ్బంది. తల్లి లేక ఏడుస్తున్న చిన్నారికి పాలు పట్టి సపర్యలు చేస్తున్నారు. మాయ ఇద్దరు పిల్లలు.. తొలి భర్తకు పుట్టిన కూతురు అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. రాకేష్, మాయ దంపతులకు ఇటీవలే ఓ చిన్నారి జన్మనిచ్చింది. చిన్నారికి నాలుగు నెలలు. మాయకు ఇద్దరు పిల్లలు.. 12 ఏళ్ల మొదటి పాప అమ్మమ్మ దగ్గర ఉంటుందని.. మాయ రాకేష్ దంపతులకు నాలుగు నెలల చిన్నారి ఉందని అన్నారు సీఐ ధనంజయ. తల్లి కోల్పోవడంతో చిన్నారిని ఐసిడిఎస్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలో ఉంచామన్నారు.

నారింజ తొక్కలతో నమ్మలేని అద్భుతాలు.. అవి చేసే మ్యాజిక్ తెలిస్తే..
నారింజ తొక్కలతో నమ్మలేని అద్భుతాలు.. అవి చేసే మ్యాజిక్ తెలిస్తే..
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే
గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే
మనోజ్ బాజ్‌ పాయ్‌ కొత్త సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం
మనోజ్ బాజ్‌ పాయ్‌ కొత్త సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం
రోజ్ డే రోజే కాదు..రోజూ రోజీ గ్లో!ఈ ఫేస్ ప్యాక్ సీక్రెట్ తెలిస్తే
రోజ్ డే రోజే కాదు..రోజూ రోజీ గ్లో!ఈ ఫేస్ ప్యాక్ సీక్రెట్ తెలిస్తే
కల్కి 2లో హీరోయిన్‌గా సాయి పల్లవి దాదాపు ఫైనల్ వీడియో
కల్కి 2లో హీరోయిన్‌గా సాయి పల్లవి దాదాపు ఫైనల్ వీడియో
పీఎఫ్‌ ఉన్నవారికి బిగ్ అప్డేట్.. త్వరలో కేంద్రం షాక్..!
పీఎఫ్‌ ఉన్నవారికి బిగ్ అప్డేట్.. త్వరలో కేంద్రం షాక్..!
జ్యోతిర్లింగాల యాత్ర మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
జ్యోతిర్లింగాల యాత్ర మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడు
సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడు
పాకిస్తాన్ అని ఆ దేశానికి పేరు పెట్టింది ఎవరో తెలుసా..?
పాకిస్తాన్ అని ఆ దేశానికి పేరు పెట్టింది ఎవరో తెలుసా..?