గుంటూరు జిల్లాలో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరంలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. గ్రామ వాలంటీర్ మానుకొండ రాజేశ్వరి సోమవారం సూసైడ్ చేసుకుంది. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్స్ కార‌ణంగా ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం గదిలోకి వెళ్లిన యువతి ఎంతకీ బయటకు రావడంతో ఇంట్లో వాళ్లు అనుమానం వచ్చి చూశారు. అయితే ఆమె గదిలో ఉరికి వేలాడ‌టం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తలుపులు బ‌ద్ద‌లుకొట్టి చూడ‌గా, అప్పటికే […]

గుంటూరు జిల్లాలో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!
Follow us

|

Updated on: May 19, 2020 | 10:28 AM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరంలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. గ్రామ వాలంటీర్ మానుకొండ రాజేశ్వరి సోమవారం సూసైడ్ చేసుకుంది. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్స్ కార‌ణంగా ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం గదిలోకి వెళ్లిన యువతి ఎంతకీ బయటకు రావడంతో ఇంట్లో వాళ్లు అనుమానం వచ్చి చూశారు. అయితే ఆమె గదిలో ఉరికి వేలాడ‌టం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తలుపులు బ‌ద్ద‌లుకొట్టి చూడ‌గా, అప్పటికే యువతి చ‌నిపోయి ఉంది. గ్రామ వాలంటీర్‌గా డ్యూటీ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య తిరిగే యువతి మరణించడంతో గ్రామంలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్పాట్ ను ప‌రిశీలిం‌చిన పోలీసులు.. యువతి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు ప్ర‌తి విలేజ్ లో కీల‌క పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.