AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: మల్లన్న గుడిలో నకిలీ పోలీస్‌ రుబాబు.. వీఐపీ మర్యాదలు కావాలంటూ పోలీసులకు పురమాయింపు!

నిత్యం వేలాది భక్తులతో రద్దీగా ఉండే శ్రీశైలం దేవాలయ అధికారలును బురిడీ కొట్టించడో నకిలీ పోలీసు. ఏంచక్కా రాచమర్యాదలు పొందాలని ప్లాన్‌ వేశాడు. నకిలీ ఆర్‌ఎస్‌ఐ అధికారిగా పరిచయం చేసుకుని, శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆలయ అధికారులు ఇతగాడి పిట్టకథలన్నీ నిజమేనని నమ్మారు. కానీ అనూహ్యంగా పోలీసులకు చిక్కడంతో అసలు బండారం..

Srisailam: మల్లన్న గుడిలో నకిలీ పోలీస్‌ రుబాబు.. వీఐపీ మర్యాదలు కావాలంటూ పోలీసులకు పురమాయింపు!
Fake RSI Police at Srisailam temple
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Sep 05, 2024 | 6:04 PM

శ్రీశైలం, సెప్టెంబర్‌ 5: నిత్యం వేలాది భక్తులతో రద్దీగా ఉండే శ్రీశైలం దేవాలయ అధికారలును బురిడీ కొట్టించడో నకిలీ పోలీసు. ఏంచక్కా రాచమర్యాదలు పొందాలని ప్లాన్‌ వేశాడు. నకిలీ ఆర్‌ఎస్‌ఐ అధికారిగా పరిచయం చేసుకుని, శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆలయ అధికారులు ఇతగాడి పిట్టకథలన్నీ నిజమేనని నమ్మారు. కానీ అనూహ్యంగా పోలీసులకు చిక్కడంతో అసలు బండారం బయటపడింది. శ్రీశైలం ఆలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌కు చెందిన కుసుమ ప్రశాంత్ అనే వ్యక్తి సెప్టెంబర్‌ 1వ తేదీన శ్రీశైలం ఆలయానికి వచ్చాడు. తాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్ఎస్సైగా పనిచేస్తున్నట్లు శ్రీశైలం పోలీసులకు చెప్పి, తనను తాను పరిచయం చేసుకున్నాడు. ముందుగానే తయారు చేసుకున్న నకిలీ ఐడీ కార్డును కూడా వారికి చూపాడు. అనంతరం తనకు వసతి గది, వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని వారిని కోరాడు. ఇదంతా.. నిజమేనని నమ్మిన పోలీసులు కుసుమ ప్రశాంత్‌కు వీఐపీ దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనంతోపాటు వసతి కూడా ఏర్పాటు చేశారు. అయితే కుసుమ ప్రశాంత్ తీరుపై అక్కడి పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే శ్రీశైలం ఒకటో పట్టణ సీఐ ప్రసాదరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో అతడు నకిలీ ఆర్ఎస్సైగా పోలీసులు గుర్తించారు. నంద్యాల పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిని అదుపులోకి తీసకుని, అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే అతడి వద్దనున్న నకిలీ పోలీసు గుర్తింపు కార్డు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. కాగా కుసుమ ప్రశాంత్ ఇలాంటి మోసాలకు పాల్పడటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ తెలంగాణలో పలు మార్లు ఫ్రాడ్‌లకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గతంలో నకిలీ పోలీసు అధికారిగా చెప్పుకొని ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు వసూలు చేశాడు. దీనిపై ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు కూడా నమోదైంది. అయినా తీరు మార్చుకోని ప్రశాంత్ మళ్లీ అదే పంథా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన తెలివి తేటలతో శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించాలను కున్నాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.