AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: మరణాంతరం తన యావదాస్తిని శ్రీవారికి చెందేలా చేసిన అపర భక్తుడు, మాజీ IRS భాస్కర్ రావు

హైద‌రాబాద్ కు చెందిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు త‌న మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు త‌న బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌ల‌ను విరాళంగా అందించి అచంచ‌ల‌మైన భ‌క్తిని చాటుకున్నారు.

TTD: మరణాంతరం తన యావదాస్తిని శ్రీవారికి చెందేలా చేసిన అపర భక్తుడు, మాజీ IRS భాస్కర్ రావు
Donation To TTD
Raju M P R
| Edited By: |

Updated on: Jul 24, 2025 | 6:30 PM

Share

తిరుమల శ్రీ‌వారిపై అచంచ‌ల‌మైన‌ భ‌క్తిని చాటుకున్నాడు ఒక భక్తుడు. మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన ఇల్లు, రూ.66 ల‌క్ష‌లు విరాళం అందేలా చేశాడు. వివరాల్లోకి వెళ్తే..  హైద‌రాబాద్‌కు చెందిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి, స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు త‌న మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన ఇంటితోపాటు త‌న బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌ల‌ను విరాళంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా శ్రీవారిపై తనకున్న అపారమైన భ‌క్తిని చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న 3,500 చదరపు అడుగులు గల ఆనంద నిలయం భవనాన్ని..  ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయ‌న టీటీడీకి విరాళంగా ఇస్తున్న‌ట్లు వీలునామాలో పేర్కొన్నారు.

బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.36 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర స‌ర్వ శ్రేయాస్ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద ప‌రిర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విద్యాదాన ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు విరాళంగా అందివ్వాల‌ని సంక‌ల్పించారు.

తన జీవితాంతం శ్రీ‌వేంకటేశ్వర స్వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాంక్షించిన భాస్క‌ర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయ‌న మ‌ర‌ణానంతరం ట్ర‌స్టీలు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్‌లు వీలునామా ప్ర‌కారం టీటీడీకి చెందాల్సిన‌ ఆస్తి ప‌త్రాలు, చెక్కుల‌ను గురువారం అందజేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయకుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో సీ.హెచ్‌. వెంక‌య్య చౌద‌రికి ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు స్వర్గీయ భాస్క‌ర్ రావు ట్ర‌స్టీల‌ను అద‌న‌పు ఈవో సత్కరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
వీటిని నీటిలో నానబెట్టి తింటే చాలు.. కాళ్లనొప్పి, అలసట మాయం
వీటిని నీటిలో నానబెట్టి తింటే చాలు.. కాళ్లనొప్పి, అలసట మాయం
వర్షాల బీభత్సం షురూ.. పలు రాష్ట్రాలకు హెవీ రేన్ అలర్ట్..!
వర్షాల బీభత్సం షురూ.. పలు రాష్ట్రాలకు హెవీ రేన్ అలర్ట్..!
నా బాడీ, నా ఛాయిస్.. నేను స్విమ్ సూట్ వేస్తే ప్రాబ్లమేంటీ.. ?
నా బాడీ, నా ఛాయిస్.. నేను స్విమ్ సూట్ వేస్తే ప్రాబ్లమేంటీ.. ?
అదృష్టం అంటే ఇది.. రైలు ఎక్కిన యువకునికి ఊహించని సర్‌ప్రైజ్..!
అదృష్టం అంటే ఇది.. రైలు ఎక్కిన యువకునికి ఊహించని సర్‌ప్రైజ్..!
ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..!
ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..!
రోహిత్‌నే తప్పిద్దామని స్కెచ్ వేశాడు.. కట్‌చేస్తే..
రోహిత్‌నే తప్పిద్దామని స్కెచ్ వేశాడు.. కట్‌చేస్తే..
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ