Special Trains: సమ్మర్ స్పెషల్.. విశాఖపట్నం నుంచి ఆ స్టేషన్లకు 5 స్పెషల్ ట్రైన్.. పూర్తి వివరాలివే..

రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఈ వేసవిలో వారానికి  ఒకసారి ప్రత్యేక రైళ్లను నడపాలని..

Special Trains: సమ్మర్ స్పెషల్.. విశాఖపట్నం నుంచి ఆ స్టేషన్లకు 5 స్పెషల్ ట్రైన్.. పూర్తి వివరాలివే..
East Coast Railway
Follow us

|

Updated on: Feb 26, 2023 | 11:59 AM

వేసవి కాలం అంటే ప్రయాణాలే. స్కూల్ విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ సొంత ఊర్లకు వెళ్లే సమయం. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఈ వేసవిలో వారానికి  ఒకసారి ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఇక ఆ రైళ్లు విశాఖపట్నం,సికింద్రాబాద్.. విశాఖపట్నం, మహబూబ్‌నగర్.. విశాఖపట్నం, తిరుపతి.. భువనేశ్వర్, తిరుపతి.. విశాఖపట్నం, బెంగుళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య 5 వీక్లీ స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. వాటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం.. 

1. విశాఖపట్నం,సికింద్రాబాద్ మధ్య వీక్లీ స్పెషల్:

ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి అందిన సమాచారం ప్రకారం విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలు(08579) మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు 08.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అంటే ఈ ట్రైన్ మొత్తం 9 పర్యటనలు చేస్తుంది. ఈ క్రమంలో విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ 11 స్టేషన్లలో ఆగనుంది. అవి దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ. ఇక తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08580) మార్చి 2 నుంచి ఏప్రిల్ 27 వరకు ప్రతి గురువారం రాత్రి 07.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 06.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా ఆయా స్టేషన్లలో ఆగుతుంది అలాగే 9 పర్యటనలు చేస్తుంది. 

2. విశాఖపట్నం, మహబూబ్‌నగర్ మధ్య వీక్లీ స్పెషల్

ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి అందిన సమాచారం ప్రకారం విశాఖపట్నం- మహబూబ్‌నగర్ వీక్లీ స్పెషల్ రైలు(08585) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 05.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. ఈ క్రమంలో ఈ రైలు 8 పర్యటనలు తిరగనుంది. అలాగే ఈ ట్రైన్ విశాఖపట్నం-కింద్రాబాద్ మధ్య దువ్వాడ, అన్నవరం సామర్లకోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, ఉమాదానగర్, షాద్‌నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో మహబూబ్‌నగర్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు(08586) మార్చి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు బుధవారాల్లో 06.20 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

3. విశాఖపట్నం, తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైలు

అలాగే విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(08583) మార్చి 6 నుంచి ఏప్రిల్ 24 వరకు సోమవారాల్లో రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇదే విధంగా ఈ ట్రైన్ 8 సార్లు తిరుగుతుంది. అలాగే ఈ ట్రైన్ విశాఖపట్నం-తిరుపతి మధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మధ్య ఆగుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08584) మార్చి 7 నుంచి ఏప్రిల్ 25 వరకు మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా 8 సార్లు ప్రయాణిస్తుంది. 

4. విశాఖపట్నం, బెంగుళూరు కంటోన్మెంట్ మధ్య వీక్లీ స్పెషల్

అంతేకాకుండా విశాఖపట్నం-బెంగుళూరు కంటోన్మెంట్ వీక్లీ స్పెషల్ రైలు(08543) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.15 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. అంటే ఈ ట్రైన్ కూడా మొత్తం 9 పర్యటనలు చేస్తుంది. అలాగే ఈ రైలు విశాఖపట్నం-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. ఇక తిరుగు దిశలో బెంగుళూరు కంటోన్మెంట్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్(08544 ) మార్చి 6 నుంచి మే 1 వరకు సోమవారాల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగుళూరు కంటోన్మెంట్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 11.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 

5. భువనేశ్వర్, తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైలు

మరో రైలు భువనేశ్వర్-తిరుపతి వీక్లీ స్పెషల్ రైలు(02809) మార్చి 4 నుంచి ఏప్రిల్ 29 వరకు శనివారాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు 07.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా 9 సార్లు ఆయా స్టేషన్ల మధ్య తిరుగుతుంది. ఇక ఈ ట్రైన్ భువనేశ్వర్, తిరుపతి మధ్య ఖుర్దారోడ్, బలుగాన్, బ్రహ్మాపూర్, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. అలాగే తిరుగు దిశలో తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్(02810) మార్చి 5 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారాల్లో తిరుపతి నుంచి 20.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 16.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!