AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్తుందా.. ఒకప్పుడు మనవి ఎర్రబస్సులు.. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోకి ఎందుకు మార్చారంటే..

మాజీ డీజీపీ, మాజీ ఆర్టీసీ ఎండీ దినేష్ రెడ్డి, హైదరాబాద్‌లో నేర నియంత్రణకు వినూత్న చర్యలు చేపట్టారు. అనంతరం, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ‘పల్లె వెలుగు’ బస్సులను ప్రవేశపెట్టి, రంగును ఆకుపచ్చ, తెలుపుకు మార్చారు. మూడు సంవత్సరాలలో 600 కోట్ల లాభాలు ఆర్జించి, సంస్థను గిన్నిస్ రికార్డుకు చేర్చారు.

గుర్తుందా.. ఒకప్పుడు మనవి ఎర్రబస్సులు.. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోకి ఎందుకు మార్చారంటే..
Bus Colour Change
Ram Naramaneni
|

Updated on: May 15, 2026 | 4:56 PM

Share

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. అంతకుముందు ఆర్టీసీ ఎండీ కూడా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణ, ఆ తర్వాత ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో ఆయన కృషి చాలా ఉంది. హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు, క్రైమ్ రేట్‌ను తగ్గించడానికి, రౌడీయిజాన్ని అరికట్టడానికి మురళీధర్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. నగరంలో సబ్‌ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసి, ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఆరుగురు పోలీసులతో మోటార్‌సైకిల్ పెట్రోల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు లేన్‌లు, సందుల్లో నిరంతరం గస్తీ తిరగడం ద్వారా నివారణ చర్యలలో కీలక పాత్ర పోషించాయి. అవినీతిని బాగా తగ్గించడం వల్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ పనితీరు మెరుగుపడి, క్రైమ్ డిటెక్షన్ రేట్ పెరిగి, నేరాల సంఖ్య తగ్గింది.

తరువాత, 2006లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండేది. దినేష్ రెడ్డి తన ముందుచూపుతో ‘పల్లె వెలుగు’ బస్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. గ్రామాల్లోని ప్రజలకు బస్సులు ఒక వరప్రసాదంలా ఉండాలనే ఆలోచనతో, ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రారంభించారు. బస్సుల రంగును ఎరుపు నుంచి ఆకుపచ్చ, తెలుపు రంగు కాంబినేషన్‌కు మార్చారు. పచ్చదనం గ్రామీణ ప్రాంతాలను సూచిస్తే, తెలుపు రంగు పాడి పరిశ్రమను ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు.

చార్జీలను పెంచకుండానే, ఆయన సమర్థవంతమైన పాలనా విధానాలతో ఆర్టీసీని లాభాల బాట పట్టించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ సహాయంతో ఆటోలు, ఇతర అన్ హెల్తీ రవాణా పోటీని అరికట్టారు. దీనివల్ల ఆర్టీసీకి ప్రయాణీకుల సంఖ్య పెరిగి, మొదటి సంవత్సరంలో 200 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. తన మూడేళ్ల పదవీకాలంలో (2006-2009) ప్రతి సంవత్సరం సగటున 200 కోట్ల రూపాయల లాభాన్ని నిలబెట్టుకున్నారు. ఈ విజయాల కారణంగా, ఏపీఎస్‌ఆర్టీసీ 20,000 బస్సుల ఫ్లీట్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

దినేష్ రెడ్డి 2009లో బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత, తదుపరి సంవత్సరంలో ఆర్టీసీకి 500 కోట్ల రూపాయల రికార్డు స్థాయి నష్టం వచ్చింది. ఈ నష్టానికి కారణాలుగా వరదలు, తెలంగాణ ఉద్యమం కారణంగా బస్సుల డ్యామేజ్, అప్పటి అధికారులు తీసుకున్న తప్పుడు విధానాలు (పీఆర్సీ విపరీతంగా పెంచడం, చార్జీలు పెంచడం) వంటివి పేర్కొనబడ్డాయి. ఈ చర్యల వల్ల ఆపరేటింగ్ రేషియో (ఓఆర్) బాగా పడిపోయి, సంస్థ తిరిగి నష్టాల ఊబిలోకి జారిపోయింది.

Follow Us