AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: మదనపల్లిలో దారుణం.. గోడౌన్‌లో యువకుడి నిర్బంధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Chittoor: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కార్తీక్ అనే దళిత యువకుడిని నాలుగు రోజులుగా నిర్బంధించారు.

Chittoor: మదనపల్లిలో దారుణం.. గోడౌన్‌లో యువకుడి నిర్బంధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Arrest
Shiva Prajapati
|

Updated on: Jul 18, 2021 | 7:53 PM

Share

Chittoor: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కార్తీక్ అనే దళిత యువకుడిని నాలుగు రోజులుగా నిర్బంధించారు. వివరాల్లోకెళితే.. మదనపల్లిలో ఉన్న సప్తగిరి షోరూమ్‌లో కర్తీక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఇటీవల కార్తిక్.. షోరూమ్ యాజమాన్యానికి తెలియకుండా బొలెరో వాహనాన్ని బయటకు తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన బొలెరో రోడ్డు ప్రమాదానికి గురవడంతో స్వల్పంగా దెబ్బ తిన్నది. ఈ విషయం తెలుసుకున్న షోరూమ్ మేనేజర్.. కార్తిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుమతి లేకుండా వాహనాన్ని తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడనే కారణంగా.. కార్తిక్‌ను షోరూమ్‌కు చెందిన ఓ గదిలో నిర్బంధించారు. దాదాపు నాలుగు రోజులగా షోరూమ్‌లోనే కార్తిక్‌ని నిర్బంధించాడు మేనేజర్. అయితే విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాల నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి షోరూమ్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. కార్తిక్‌ను నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ ఏజెన్సీలో రెచ్చిపోయిన దొంగలు.. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని పాడేరులో ఉన్న బజాజ్ షో రూమ్‌లో చోరీకి విఫల యత్నం చేశారు. షో రూమ్ లోకి చొరబడ్డ దొంగలు క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లారు. క్యాష్ కౌంటర్ ను సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ లాకర్ ఎంతకూ ఓపెన్ అవ్వలేదు. దాంతో క్యాష్ కౌంటర్‌ను తీసుకువెళ్తే దొరికిపోతామని భయపడిన దొంగలు.. ఆ క్యాష్ కౌంటర్‌ను తుప్పల్లోనే విడిపెట్టి పారిపోయారు. తుప్పల్లో పడిఉన్న క్యాష్ కౌంటర్‌ను గుర్తించిన స్థానికులు.. షోరూమ్ సిబ్బందికి సమాచారం అందించారు. షోరూమ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Mahabubabad: ఎలుకల పాలైన రెండున్నర లక్షల రూపాయలు.. బాధితుడికి అండగా నిలిచిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్..

Telangana Corona: తెలంగాణకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు..

Telangana-Andhra: ఇక్కడేమో నాటు పడవల్లో.. అక్కడేమో బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో.. వాటే క్రియేటివీటీ..

Follow Us
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని