Corona Vaccine: ఆంధ్రప్రదేశ్లో కోటి మందికిపైగా కోవిడ్ టీకాలు : రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి
Corona Vaccine: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతంగా కొనసాగుతోంది. హెల్త్ కేర్ వర్కర్లు వృధా కాకుండా టీకాలు వేయడం వల్ల 2 లక్షల మందికి అదనంగా టీకాలు వేసినట్లు..
Corona Vaccine: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతంగా కొనసాగుతోంది. హెల్త్ కేర్ వర్కర్లు వృధా కాకుండా టీకాలు వేయడం వల్ల 2 లక్షల మందికి అదనంగా టీకాలు వేసినట్లు ఏపీ రాష్ట్ర కోవిడ్ నోడ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ ఆర్జా శ్రీకాంత్ అన్నారు. కోవిడ్ వ్యాధి నివారణా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,00,74,471 మందికి మొదటి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు 98,85, 650 డోసులు అందగా, ఇందులో కేంద్రం నుండి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 66,82,570 డోసులు, కోవాగ్జిన్ 15,17,450 డోసులు అందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 13,41,700 కోవిషీల్డ్ డోసులు, 3,43,930 కోవాగ్జిన్ డోసులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటి వరకూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 82,95,973 మందికి, కోవాగ్జిన్ 17,78,218 మందికి వేయించామని, ఇందులో మొదటి డోసు టీకా వేసుకున్నవారు 75,45,304 మంది, రెండు డోసులూ వేసుకున్నవారు 25,29,167. మొత్తం 98,85, 650 డోసులను ఉన్నాయి. ఇక రాష్ట్రంలో టీకాలు తీసుకున్న వారి సంఖ్య 1,00,74,471 మందికి చేరింది. మరింత మంది కి వాక్సిన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క రోజులో 5 లక్షల కు పైగా వాక్సినేషన్ లు వేసి దేశం లోనే ప్రథమ స్థానం లో ఉంది ఏపీ రాష్ట్రంలో ఉన్నట్లు నోడల్ అధికారి తెలిపారు.
ఇవీ కూడా చదవండి: