AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor : చిత్తూరు టూ చెన్నై…అర్జెంట్‌గా దూసుకెళ్తున్న అంబులెన్స్‌..! అత్యవసరంగా ల్యాండ్‌ అయిన పోలీసులు..బొమ్మ అదిరింది!!

సినిమాలను చూసి స్మగ్లర్లు ఇన్‌స్పైర్‌ అవుతారో, లేదంటే జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తారో తెలియదుగానీ,ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సినిమా రెంజ్‌లో అక్రమ వ్యాపారానికి తెరలేపారు.

Chittoor : చిత్తూరు టూ చెన్నై...అర్జెంట్‌గా దూసుకెళ్తున్న అంబులెన్స్‌..! అత్యవసరంగా ల్యాండ్‌ అయిన పోలీసులు..బొమ్మ అదిరింది!!
Ambulance Loaded
Jyothi Gadda
|

Updated on: May 26, 2022 | 8:34 PM

Share

సినిమాలను చూసి స్మగ్లర్లు ఇన్‌స్పైర్‌ అవుతారో, లేదంటే జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తారో తెలియదుగానీ,ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సినిమా రెంజ్‌లో అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించే అంబులెన్స్ లో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు కేటుగాళ్లు. అధికారుల కళ్లు గప్పి అంబులెన్స్‌లో సీక్రెట్‌గా ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లాఓ పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఎర్రచందనం దొంగలు నయా ప్లాన్ తో దుంగలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా నుంచి చెన్నైకి అంబులెన్స్ లో ఎర్రచందనం తరలిస్తూ దొరికిపోయారు. రూ.కోటి విలువైన 71 ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న 15మందిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చిత్తూరు జిల్లా చిత్తూరు మండల పోలీసులు 15మంది అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రదారులు పెరుమాళ్‌, అజిత్‌, వినోద్‌, శరత్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరూ తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

నిన్న కూడా చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ …ఇందుకు సంబంధించి ఐదుగురు స్మగ్లర్లు ను అరెస్టు చేశామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారుల మంగళవారం నుంచి వివిధ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.

ఇవి కూడా చదవండి
Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!