Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar Fish: వేటగాళ్ల వలకు చిక్కిన ఆరుదైన చేప.. అక్కడి జలపుష్పాలను ఎగబడి కొంటోన్న జనాలు

ఉలస, పులస, బొమ్మిడాయిలు, బుడ్డ పక్కిల, కొర్రమీను, గడ్డిమూస, బంగారు తీగ, వంజరం.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల చేపలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అరణియార్‌ జలాశయం ఫేమస్‌. ఇక్కడ సహజవాతావరణంలో పెరిగే చేపలు ఆహారప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి. ఏడాది పొడవునా సమృద్ధిగా..

Oscar Fish: వేటగాళ్ల వలకు చిక్కిన ఆరుదైన చేప.. అక్కడి జలపుష్పాలను ఎగబడి కొంటోన్న జనాలు
Oscar Jilebi Fish
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 11, 2023 | 3:46 PM

ఉలస, పులస, బొమ్మిడాయిలు, బుడ్డ పక్కిల, కొర్రమీను, గడ్డిమూస, బంగారు తీగ, వంజరం.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల చేపలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అరణియార్‌ జలాశయం ఫేమస్‌. ఇక్కడ సహజవాతావరణంలో పెరిగే చేపలు ఆహారప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి. ఏడాది పొడవునా సమృద్ధిగా నీరు నిల్వ ఉండడంతో మత్స్యకారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నదిలో 50 గ్రాముల నుంచి 50 కిలోల బరువు చేప కూడా జీవిస్తుందని జాలరులు అంటున్నారు. 0.25 కేజీ సైజుతో రొయ్యలు కూడా దొరుకుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాల కారణంగా కొత్తనీరు చేరడంతోపాటు అరుదైన చేపలు జలాశయంలోకి వచ్చిచేరాయి. వీటిల్లో ఆస్కార్‌ మీనం పసుపు, బంగారు వర్ణంలో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రిజర్వాయర్‌లోకి వరద వచ్చినప్పుడు మత్స్యకారులకు భారీ చేపలు పడుతుంటాయి. ఈ క్రమంలోనే అరణియార్‌ ప్రాజెక్టులో సోమవారం జాలర్ల వలకు ఆస్కర్‌ జిలేబీ అనే చిక్కింది. పిచ్చాటూరు ఎస్టీ కాలనీకి చెందిన మారయ్య విసిరిన వలలో ఈ చేప పడింది. వందల కుటుంబాలకు జీవనోపాధి ఇచ్చే ఈ ప్రాజెక్టులో అప్పుడప్పుడు ఇలాంటి చేపలు జాలర్లకు చిక్కుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు సమీపంలోని శేషంపేటలో శేఖర్‌ అనే రైతు గత ఏడాది కలర్‌ చేప పెంపంకం చేపట్టాడని.. ఐతే నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శేఖర్‌ చేపల గుంట మునిగిపోవడంతో అందులోని చేపలు కొన్ని అరణియార్‌ జలాశయంలోకి చేరాయని మత్స్యశాఖ అధికారి నరేంద్రబాబు తెలిపారు. అవే అప్పుడప్పుడు జాలర్లకు చిక్కుతున్నట్లు ఆయన తెలిపారు. అరణియార్‌ చేపల రుచికి చేపల ప్రియులు ముగ్ధులవుతుంటారు. నీరు తగ్గిపోతున్నప్పుడు జలాశయం తీరంలోని గుంతల్లో కొర్రమీనులు లభిస్తుంటాయి. వీటిని కిలో రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయిస్తుంటారు. మిగతా చేపలు కిలో రూ.100 నుంచి రూ.150కే ఆహార ప్రియులకు విక్రయిస్తుంటారు. జాలర్లు చేపలను ఒడ్డుకు తీసుకురాగానే జనం ఎగబడి మరీ క్షణాల్లో కొనుక్కువెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే