CM Ramesh: పవన్ ఇంటి వద్ద రెక్కీపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే.. బీజేపీ సీఎం రమేశ్ డిమాండ్
'పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులురెక్కీ చేసి పెట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కనీసం స్పందించడం లేదు కూడా. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ఇలా చేస్తారా?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద నిర్వహించిన రెక్కీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. అలాగే జనసేనానికి తగినంత భద్రత ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారును కోరారు. ‘పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులురెక్కీ చేసి పెట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కనీసం స్పందించడం లేదు కూడా. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ఇలా చేస్తారా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం. పోలీసులు చట్టాన్ని, ప్రజలను కాపాడాలి. కానీ పోలీసులే రౌడీల్లా వ్యవహరిస్తే ఎలా? ఏపీ పోలీసులపై కేంద్ర హోం మంత్రిని, హోంశాఖ కార్యదర్శిని కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తాం. అలాగే పవన్ ఇంటివద్ద నిర్వహించిన రెక్కీపై ఏపీ ప్రభుత్వం ముందు సమాధానం చెప్పాలి. అలాగే ఆయనకు తగినంత భద్రత ఏర్పాటుచేయాలి’ డిమాండ్ చేశారు సీఎం రమేశ్.
కాగా పవన్ కల్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశం పైన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్.. మాజీ మంత్రి కొడాలి నాని ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసారు. సానుభూతి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఆరితేరిపోయారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కు ఏం జరిగినా అంటే మంచి జరిగినా.. చెడు జరిగినా చంద్రబాబుదే బాధ్యత అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..