AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP JP Nadda: కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్ర సర్కార్‌పై జేపీ నడ్డా విమర్శలు

రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.. కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

BJP JP Nadda: కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్ర సర్కార్‌పై జేపీ నడ్డా విమర్శలు
Jp Nadda
Sanjay Kasula
|

Updated on: Jun 07, 2022 | 7:18 PM

Share

రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు.. కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు నడ్డా మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉంటుందని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలు ఉండేవన్నారు. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదన్నారు. గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలుగా నిలిచేవని.. మోదీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. గతంలో బంధుప్రీతి వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేదన్నారు. మోదీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారని అన్నారు. దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నారు.

ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేసి.. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు గతంలో పేపర్లకే పరిమితమయ్యేవి.. ప్రస్తుతం దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. భారతదేశం ఉత్పాతక దేశంగా మారిందని.. భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరిగాయని తెలిపారు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా 2.5కోట్ల ఇళ్లు నిర్మించినట్లుగా వెల్లడిచారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనేదే మోదీ కల.. ఆ కలను నెరవేరుస్తాని పేర్కొన్నారు. ఒకే దేశం- ఒకే గ్రిడ్‌, ఒకే దేశం- ఒకే రేషన్‌ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. భారత్‌ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది. రెండో అతి పెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారిందన్నారు. దేశంలో 79 కోట్ల బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాలని జేపీ నడ్డా అన్నారు

Follow Us
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు