Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీదే నైతిక విజయంః పనతల సురేష్

బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే నైతిక విజయమని బిజేపీ అభ్యర్థి పనతల సురేష్ అన్నారు.

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీదే నైతిక విజయంః పనతల సురేష్
Panathala Suresh
Follow us

|

Updated on: Nov 02, 2021 | 1:04 PM

Badvel By Election Result 2021: బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే నైతిక విజయమని బిజేపీ అభ్యర్థి పనతల సురేష్ అన్నారు. వైసీపీకి వచ్చిన మెజారిటీ అంత దొంగ ఓట్లేనని ఆరోపించారు. వైసీపీ మెజార్టీకి అధికారులు, పోలీసు యంత్రాంగం సహకరించారని సురేష్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారపార్టీని ధీటుగా ఎదుర్కొనేది బీజేపీ ఒక్కరే అన్న ఆయన.. ఇతర పార్టీల్లా పారిపోయే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు పోలీసు వ్యవస్థకు సన్మానం చేయాలన్నారు. బీజేపీ పక్షాన నిలబడ్డ బద్వేల్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ గుండాయిజం చేసిన ధైర్యంగా ఎదుర్కొన్నారు. సీఎం జగన్ పతనానికి బద్వేల్ నుండి నాంది అన్నారు.