AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఈవీఎంల ధ్వంసంపై మాటలయుద్ధం.. టీడీపీ నేతల ఆగడాలు చూడండంటూ వైసీపీ వీడియో విడుదల..

పోలింగ్ రోజు పల్నాడుజిల్లా మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.. పాల్వాయి గేట్‌లో MLA పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారనే దానిపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా... మరోవైపు పోలింగ్‌ బూత్‌లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా వీడియోను రిలీజ్‌ చేయడంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కించాయి.

Andhra Pradesh: ఈవీఎంల ధ్వంసంపై మాటలయుద్ధం.. టీడీపీ నేతల ఆగడాలు చూడండంటూ వైసీపీ వీడియో విడుదల..
Ap Politics
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2024 | 3:58 PM

Share

పోలింగ్ రోజు పల్నాడుజిల్లా మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.. పాల్వాయి గేట్‌లో MLA పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారనే దానిపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా… మరోవైపు పోలింగ్‌ బూత్‌లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా వీడియోను రిలీజ్‌ చేయడంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కించాయి. తుమ్మురుకోటలో టీడీపీ బీభత్సం చేసిన మొత్తం వీడియోలు విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలింగ్‌ రోజు పాల్వాయి గేట్‌లో జరిగిన మొత్తం వీడియో ఫుటేజ్‌ను ఈసీ అధికారులు పరిశీలించాలని ట్వీట్‌ చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి..

మరోవైపు ఎన్నికల పోలింగ్‌పై మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. పోలింగ్ రోజు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు అంబటి. పల్నాడు జిల్లా నార్నేపాడులోని 236, 237.. దమ్మలపాడులోని 253, 254 పొలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. వెబ్ క్యాస్టింగ్‌ పరిశీలించి రీ పొలింగ్‌కు ఆదేశించాలని అంబటి తరపున అడ్వకేట్ వాదనలు వినిపించారు. మరోవైపు ఎన్నికలు ముగియడంతో ఎలక్షన్ ట్రిబ్యునల్‌కి వెళ్లాలని ఈసీ వాదనలు వినిపించింది. న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

వైసీపీ వీడుదల చేసిన వీడియో..

వీడియోను మేం విడుదల చేయలేదు..

ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియోపై సీఈవో మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియో ఎలక్షన్ కమిషన్ నుంచి విడుదల కాలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే వీడియో ఎలా బయటకు వెళ్లిందో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ ఎపిసోడ్‌లో పాల్పాయిగేటు పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశామన్నారు మీనా.

మాచర్లలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. ఈ సమయంలో టీడీపీ నేతలు అక్కడికి వెళ్లడం సరికాదన్నారు సీఈవో మీనా. ఒకవేళ టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. టీడీపీ నేతలు మాత్రమే కాదూ.. బయటి వ్యక్తులెవరూ పరామర్శకు మాచర్లకు వెళ్లొదన్నారు.

పిన్నెల్లి ఎప్పుడైనా లొంగిపోయే ఛాన్స్..

నర్సరావుపేట కోర్టులో ఏ క్షణమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోయే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఈమేరకు కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. కోర్టు పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా.. పిన్నెల్లి కోసం ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి వెతుకుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!