Rain Alert: బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..
వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. వచ్చే మూడు రోజుల వెదర్ రిపోర్ట్ చూడండి..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు, సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..
బుధవారం, గురువారం, శుక్రవారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. శుక్రవారం (11తేది) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. చెట్లు క్రింద నిలబడరాదని సూచించారు.
నైరుతి,ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని #APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా,ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి ఆతదుపరి 24 గంటల్లో మధ్యబంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు. pic.twitter.com/t7sOg4Y1FE
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) April 8, 2025
మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5°C, కర్నూలు జిల్లా కామవరం 40.7 C, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 25 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..