Gannavaram Politics: గన్నవరంలో వేడెక్కిన రాజకీయం.. ఒరిజినల్‌ వైసీపీ వర్సెస్ నయా వైసీపీ మధ్య ఫైట్!

గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. ఓరిజినల్‌ వైసీపీ వర్సెస్ నయా వైసీపీ మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది.

Gannavaram Politics: గన్నవరంలో వేడెక్కిన రాజకీయం.. ఒరిజినల్‌ వైసీపీ వర్సెస్ నయా వైసీపీ మధ్య ఫైట్!
Vallabaneni Vamsi
Follow us

|

Updated on: Mar 20, 2022 | 6:22 PM

Gannavaram Political Heat: గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. ఓరిజినల్‌ వైసీపీ వర్సెస్ నయా వైసీపీ మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఈ పంచాయితీ వైసీపీ(YCP) ఆగ్రనేత విజయసాయి రెడ్డి(Vijay Saireddy) దాకా వచ్చింది. దీంతో గన్నవరం టాక్‌ ఆఫ్‌ దీ ఏపీగా మారింది. ఏపీ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కృష్ణా జిల్లా. ఆ జిల్లాలో గన్నవరం నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇప్పుడు అక్కడ రాజకీయం మాంచి కాక మీద ఉంది. ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే ఎమ్మెల్యే టికెట్‌ కోసం పైరవీలు మొదలయ్యాయి. అటు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మళ్లీ యార్లగడ్డకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు కార్యకర్తలు. టీడీపీ తరఫున గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ, సీఎం జగన్‌కు బాగా దగ్గరయ్యారు. అప్పటినుంచి గన్నవరంలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. దీంతో దుట్టా రామచంద్రారావు వర్సెస్‌ వల్లభనేని వంశీ వయా యార్లగడ్డ వెంకట్రావ్‌ అన్నట్టుగా మారింది రాజకీయం.

తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయసాయిరెడ్డికి ఫిర్యాడు చేశారు కొందమంది నాయకులు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు విజయసాయి వద్ద వాపోయారు. గతంలో వైసీపీ ఓటమి కోసం పనిచేసి టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ, తమను ఇబ్బందిపెడుతున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ వంశీకి ఇవ్వొద్దని, యార్లగడ్డ వెంకట్రావ్‌కే ఇవ్వాలని విజయసాయిని కోరారు నేతలు.

కార్యకర్తలను కలుపుకుపోతానని వైసీపీలోకి వచ్చిన వంశీ, తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అయితే, ఇది చాలా సున్నితమైన అంశం అని, కొన్నాళ్లలో సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చారు విజయసాయిరెడ్డి. ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి, అన్ని సర్దుకునేలా చేస్తానని చెప్పారు. గతంలోనూ దుట్టా వర్గం, వల్లభనేని వర్గాలు బాహాబాహికి దిగిన సందర్భాలున్నాయి. ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే కుర్చీలతో కొట్టుకున్నారు. ఇటీవల పోలీస్‌ స్టేషన్ల వరకు వెళ్లింది వీరి వర్గపోరు. యార్లగడ్డ వెంకట్రావ్‌ స్వయంగా స్టేషన్‌కు వెళ్లి, తన అనుచరులను విడిపించాల్సి వచ్చింది. వంశీ వచ్చినప్పటి నుంచి అనేక వివాదాలు జరగడం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీనిపై జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జరుగుతోంది.

Read Also… 

KTR US Tour:పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. ఘనస్వాగతం పలికిన ప్రవాసీలు

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం విషయంలో లోటుండదు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం విషయంలో లోటుండదు..
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం