AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balineni: జగన్‌ తలుచుకుంటే చంద్రబాబు, లోకేష్‌ భస్మం అయిపోతారు: మంత్రి బాలినేని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన కార్యక్రమం, పట్టాభి వ్యవహారం మీద ఆం‍ధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు.

Balineni: జగన్‌ తలుచుకుంటే చంద్రబాబు, లోకేష్‌ భస్మం అయిపోతారు: మంత్రి బాలినేని
Balineni On Chandrababu
Venkata Narayana
|

Updated on: Oct 21, 2021 | 1:05 PM

Share

Balineni Srinivas Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన కార్యక్రమం, పట్టాభి వ్యవహారం మీద ఆం‍ధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. జగన్‌ తలుచుకుంటే చంద్రబాబు, లోకేష్‌ భస్మం అయిపోతారన్నారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలమయమని చెప్పుకొచ్చిన బాలినేని, చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి బూతులు మాట్లాడారన్నారు. చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష అని మంత్రి బాలినేని విమర్శించారు. ఏపీలో కుట్రలో కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు.

పట్టాభి మాట్లాడిన అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకోస్తారా? అని ప్రశ్నించిన బాలినేని.. గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగలబెట్టించారని ఆరోపించారు. పైయిడ్ ఆర్టిస్ట్ పట్టాభిని ఇలా మాట్లాడి ఉండకుండాల్సింది అనకుండా పైగా మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటున్నాడు ఈ సంస్కార హీనుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు బాలినేని. “ప్రజాస్వామ్య స్పూర్తి అంటే ఇలా ఇష్టం వచ్చినట్లు తిట్టడమా? నిన్నటి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి.” అని బాలినేని డిమాండ్ చేశారు.

పార్టీ అధినేత చంద్రబాబుని క‌లిసొచ్చిన త‌ర్వాతే ప్రెస్‌మీట్ పెట్టి పట్టాభి ఇలాంటి భాష మాట్లాడటం చూస్తుంటే కచ్చితంగా బాబు ఆదేశాలతోనే మాట్లాడిన‌ట్టు అర్థమ‌వుతోందని బాలినేని సందేహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని గౌర‌వ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబే పూర్తి బాధ్యత వ‌హించాలని మంత్రి అన్నారు.

Read also:  Kannababu: సింపథీ వస్తుందనుకుంటే పొరపాటే, చివరికి చంద్రబాబు, వారి పార్టీనే అభాసుపాలవుతుంది: ఏపీ మంత్రి

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..