AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election: వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మే13 తేదీన జరగనున్న పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తి కాగా, సజావుగా పోలింగ్ జరిపేందుకు, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు తగిన ఏర్పాట్లు కల్పించటంలో నిమగ్నమైంది జిల్లా యంత్రాంగం.

Lok Sabha Election: వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు
Election Arrangements
S Srinivasa Rao
| Edited By: |

Updated on: May 02, 2024 | 12:48 PM

Share

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మే13 తేదీన జరగనున్న పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తి కాగా, సజావుగా పోలింగ్ జరిపేందుకు, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు తగిన ఏర్పాట్లు కల్పించటంలో నిమగ్నమైంది జిల్లా యంత్రాంగం. అందులో భాగంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్దులు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా వీల్ చైర్లు అందుబాటులోకి తెస్తూన్నారు.

గురువారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా వీల్ చైర్ లను, మాగ్నిఫయింగ్ (భూతద్దాలు) ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్‌తోపాటు మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా 1700 వీల్ చైర్లు, కంటి చూపు తక్కువ ఉన్నవారికి మాగ్నిఫయింగ్ (భూతద్దాలు) 1700 కేటాయించారు. వాటిని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించి సంబంధిత నియోజక వర్గాలకు పంపేందుకు చర్యలు చేపట్టారు.

ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీల్ చైర్లు, మాగ్నిఫయింగ్ (భూతద్దాలు) పంపించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే ఈ సదుపాయాన్ని అవసరమున్న ఓటర్లు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే