ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గాయపడ్డారు. పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా రెండు బైకులు ఢీకొన్నాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విద్యార్థుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.