AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: ఆరోగ్యశ్రీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం.. వారి కోసం రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు..!

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని..

AP CM Jagan: ఆరోగ్యశ్రీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం.. వారి కోసం రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు..!
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 14, 2021 | 11:27 AM

Share

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్యాన్సన్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు జగన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో క్యాన్సర్‌కు సంబంధించి ఆస్పత్రులు లేకపోవడం వల్ల హైదరాబాద్‌, బెంగళూలు, ఇతర ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని, అందుకే రాష్ట్రంలోనే క్యాన్సన్‌ బాధితులకు సరైన చికిత్స అందేలా ఈ నిర్ణయం తీసుకుట్లు చెప్పారు.

మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు: కాగా, రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుతాయని సీఎం తెలిపారు. ఇవేకాకుండా క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేక యాప్‌.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేక యాప్‌ తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపారు. ఇందు కోసం సలహాల నివృత్తికి ఏర్పాట్లు ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ ఆరోగ్యశ్రీ యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఇవ్వనుంది. వారికి మొబైల్‌లను ఇచ్చేందుకు జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

MLA Roja Selvamani: ఎమ్మెల్యే రోజాను వెంటాడుతున్న అసమ్మతి సెగ.. సొంత నియోజకవర్గంలోనే..

AP Crime News: అనంతపురంలో కన్నింగ్ లేడీ కహానీ.. లక్షకు పది వేల వడ్డీ ఇస్తానంటూ