AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Bay of Bengal: విశాఖకు ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!

ఇప్పటికే తౌక్టే తుఫాను ధాటికి భారతావని వణికిపోతుంటే.. మరో ముప్పు పొంచి ఉంది. ఈనెల 22 తేదీన తూర్పు తీర ప్రాంతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశమందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Cyclone Bay of Bengal: విశాఖకు ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!
Balaraju Goud
| Edited By: |

Updated on: May 19, 2021 | 8:39 PM

Share

Cyclone form over Bay of Bengal: ఇప్పటికే తౌక్టే తుఫాను ధాటికి భారతావని వణికిపోతుంటే.. మరో ముప్పు పొంచి ఉంది. ఈనెల 22 తేదీన తూర్పు తీర ప్రాంతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశమందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీనికి యాస్ తుఫానుగా నామకరణం చేశారు అధికారులు.

తౌక్టే తుపాను ధాటికి దేశ పశ్చిమ తీర రాష్ట్రాల్లో సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే.. మరో ముప్పు మూసుకువస్తోంది. మే 26-27 తేదీల్లో మరో తుఫాను తూర్పు తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ నెల 22న ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇటు ఆంధప్రదేశ్ తీర ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

‘‘అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. అది వాయువ్య దిశగా కదులుతూ మే 26 నాటికి పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను తాకే అవకాశముంది’’ ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం వెల్లడించింది. తుపాను ప్రభావంతో అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఒడిశా, బెంగాల్‌, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

సాధారణంగా రుతుపవనాల ఆగమనానికి ముందు ఏప్రిల్‌, మే నెలల్లో తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపానులు ఏర్పడుతుంటాయి. గతేడాది మే నెలలో అంఫన్‌, నిసర్గ తుపానులు తీర రాష్ట్రాల్లో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పశ్చిమాన తౌక్టే తుపాను విరుచుకుపడింది. తౌక్టే ధాటికి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలకు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముంబయి తీరంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి.

Read Also… Southwest Monsoon : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్… ముందే పలకరించనున్న నైరుతి..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన