AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja: “సినిమా డైలాగులు కొట్టడం కాదు.. సీఎంతో పోటీ పడాలి”.. పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా ఫైర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలిటిక్స్ వాడీవేడీగా సాగుతున్నాయి. మూడు రాజధానుల విషయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ అంటుంటే.. అమరావతినే..

Roja: సినిమా డైలాగులు కొట్టడం కాదు.. సీఎంతో పోటీ పడాలి.. పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా ఫైర్
Minister Roja
Ganesh Mudavath
|

Updated on: Sep 19, 2022 | 3:51 PM

Share

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలిటిక్స్ వాడీవేడీగా సాగుతున్నాయి. మూడు రాజధానుల విషయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ అంటుంటే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన సర్వే.. జనసేనకు ఎన్ని వస్తాయనే విషయం చెప్పలేదా అని ప్రశ్నించారు. పార్టీపై నమ్మకం ఉంటే సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. సినిమా డైలాగులు కొట్టడం కాదు…నేరుగా సీఎం తో పోటీ పడాలని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేశ్ (Lokesh) తన యత్రని రద్దు చేస్తే, పవన్ కూడా రద్దు చేసుకున్నారని, కేసుల భయంతో మాజీ ముఖ్యమంత్రి కరకట్టపై దాక్కున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అసెంబ్లీ కి ఏడ్ల బండిపై వచ్చి నవ్వుల పాలు అయ్యారని, అసలైన రైతు ద్రోహులు చంద్రబాబు, లోకేశ్ లేనని మండిపడ్డారు. ప్రభుత్యం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్న మంత్రి రోజా.. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన ఘనత చంద్రబాబు దేనని చెప్పారు. చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న రైతులు బినామీ, రియల్ ఎస్టేట్ వాళ్లేనని, నిజమైన రైతులు సీఎం కు ఎప్పుడూ రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు.

కాగా.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేపట్టదలచుకున్న బస్సు యాత్ర వాయిదా పడింది. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆ తర్వాతే బస్సు యాత్రను నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అక్టోబర్ లో బస్సు యాత్ర చేయాలని జనసేన నిర్ణయించగా.. కౌలు రైతుల సమస్యలపై పవన్ చేస్తున్న పర్యటనలు ఇంకా కొన్ని జిల్లాల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ పర్యటన పూర్తి చేసిన తర్వాతే బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకటించాలని నిర్ణయించారు. రోజురోజుకు జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..