ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని అస్వస్థతకు గురయ్యారు. నిన్న మచిలీపట్నంలోని వైసీపీ నేత భాస్కర్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు పేర్ని నాని. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన నాని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా సోమవారం వైసీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మరణ వార్త విన్న మంత్రి పేర్ని నాని హుటాహుటిన...

ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 1:22 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని అస్వస్థతకు గురయ్యారు. నిన్న మచిలీపట్నంలోని వైసీపీ నేత భాస్కర్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు పేర్ని నాని. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన నాని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా సోమవారం వైసీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మరణ వార్త విన్న మంత్రి పేర్ని నాని హుటాహుటిన భాస్కర్ రావు ఇంటికి చేరుకున్నారు. వైసీపీ నేత మృతదేహాన్నిచూసిన పేర్ని నాని ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం భాస్కర్ రావు కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని కత్తులతో పొడిచి హతమార్చారు. దీంతో ఈకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వైసీపీ నేత హత్య కేసులో ముగ్గురు నిందితులను గుర్తించారు. భాస్కరరావును హత్య చేసేందుకు మూడు రోజులుగా వీరు రెక్కీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. కత్తితో హత్య చేసిన వ్యక్తిని చింత పులిగా గుర్తించాం. హత్య చేసి అనంతరం బైక్‌పై ఎక్కించికెళ్లిన మరో నిందితుడు చింత చిన్ని. ఈ కేసుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు పోలీసులు. హత్యపై పొలిటికల్ వార్ వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం 4 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.