Andhra Pradesh: అదే నిజమైతే.. జగన్ బంధువులమైన మేమే ముందు మారాలి కదా? సంచలన కామెంట్స్ చేసిన మంత్రి బాలినేని..
Andhra Pradesh: అధికార వైసీసీ రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తోందంటూ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై...
Andhra Pradesh: అధికార వైసీసీ రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తోందంటూ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కుల, మతాలకు తీతంగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫాదర్లు, మౌజన్లతో పాటు పూజారులకు కూడా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని తెలిపారు. బీజేపీ నేతలు అంటున్నట్లుగా.. మత మార్పిడీలు చేయాలంటే జగన్ బంధువులమైన తామే ముందు మతం మారాలి కదా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు. తామంతా హిందువలమే అని, సోము వీర్రాజు ఆరోపణలు చేస్తున్నట్లు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు.
సెక్యులర్ దేశంలో ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించవచ్చని, బలవంతం ఎవరూ మత మార్పిడీలు చేయరిన మంత్రి బాలినేని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే మతం అంశాన్ని ముందుకు తెచ్చారని, వీరి ఆరోపణలను ప్రజలు విశ్వసించలేదని గుర్తు చేశారు. వైఎస్ జగన్ తిరుపతితో సహా అన్ని దేవాలయాలకు వెళతారని, అన్ని మతాలను సమానంగా చూస్తారని అన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే సోము వీర్రాజు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఈ పద్ధతి సరికాదని మంత్రి బాలినేని శ్రీనివాసులు హితవు చెప్పారు.
Also read:
Ishq Movie Review: ‘ఇష్క్.. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’.. ప్రేక్షకులను మెప్పించేనా ?
Telangana: ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ కొత్త షరతు.. అది లేకుంటే లైసెన్స్ రద్దు..!
Crime News: గుండెపోటు కాదు.. కట్టుకున్న భార్యే కడతేర్చింది.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..