Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి.. ఎప్పటినుంచంటే?

రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు.. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ గుర్తింపు ఆధారిత (ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్) హాజరు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

AP News: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి.. ఎప్పటినుంచంటే?
Ap Employees
Follow us
Venkata Chari

|

Updated on: Dec 28, 2022 | 5:54 AM

ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులకు జనవరి 1 నుంచి హాజరులో కీలక మార్పులను ప్రభుత్వం చేపట్టింది. ఈ మార్పులతో రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు.. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ గుర్తింపు ఆధారిత (ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్) హాజరు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇకపై అంటే జనవరి నుంచి దీనిని తప్పనిసరిగా అమలు చేయనున్నారు. ఈ మేరకు ఓ జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తిగల ప్రభుత్వ సంస్థలు, జిల్లా కలెక్టరేట్లు, అన్ని ప్రాంతీయ, డివిజినల్, జిల్లా కార్యాలయాలు, స్థానిక సంస్థలు, మండల, గ్రామస్థాయి కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలన్నిటికీ దీన్ని వర్తింప జేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా స్థాయి కార్యాలయాల్లో వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి, మిగతా కార్యాలయాల సిబ్బందికి జనవరి 16 నుంచి ఈ విధానం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..