AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్రా పోలీస్‌ తడాఖా ఏంటో చాటి చెప్పే ఖతర్నాక్‌ కేసు.. సలామ్ కొట్టాల్సిందే..

తీగ లాగితే డొంక కదిలింది.. ఫేక్‌ కరెన్సీపై ఫోకస్‌ పెడితే ఏకంగా డెడ్లీ వెపన్స్‌ అండ్‌ డేంజరస్‌ గ్యాంగ్‌ ఖాకీల చేతికి చిక్కింది. దాని ఆధారంగా రెండు నటోరియస్‌ గ్యాంగ్‌ల బెండు తీశారు..

Andhra Pradesh: ఆంధ్రా పోలీస్‌ తడాఖా ఏంటో చాటి చెప్పే ఖతర్నాక్‌ కేసు.. సలామ్ కొట్టాల్సిందే..
Ap Police
Shiva Prajapati
|

Updated on: Dec 27, 2022 | 10:23 PM

Share

తీగ లాగితే డొంక కదిలింది.. ఫేక్‌ కరెన్సీపై ఫోకస్‌ పెడితే ఏకంగా డెడ్లీ వెపన్స్‌ అండ్‌ డేంజరస్‌ గ్యాంగ్‌ ఖాకీల చేతికి చిక్కింది. దాని ఆధారంగా రెండు నటోరియస్‌ గ్యాంగ్‌ల బెండు తీశారు అనంతపురం జిల్లా పోలీసులు. మేడిన్‌ ఆంధ్రా పోలీస్‌ తడాఖా ఏంటో చాటి చెప్పే ఖతర్నాక్‌ కేసు ఇది. ఈ కేసుకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, అనంత ఎస్పీ ఫకరీప్ప చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

జంషీద్, షఫీవుల్లా, అమీర్ బాషా, ముబారక్ ఫ్రమ్‌ బెంగళూరు. ఈ నలుగురు కర్నాటకలో కరుడుగట్టిన క్రిమినల్స్‌. లూటీలు, కిడ్నాప్‌లు, ఖూనీలు, నకిలీ నోట్ల చలామణి, అదీ ఇదీ అని కాకుండా ఈ కేటుగాళ్లు చేయని క్రైమంటూ లేదు. పైసా కోసం ఎంతకైనా తెగించే పక్కా బద్మాష్‌గాళ్లు. సింగిల్‌లైన్‌లో చెప్పాలంటే నరరూపరాక్షసులు. అయితే, ఫేక్‌ కరెన్సీ రాకెట్‌పై ఫోకస్‌ పెట్టిన అనంతపురం పోలీసులు.. ఈ డేంజరస్‌ గ్యాంగ్‌ బెండు తీశారు. ఆరా తీస్తే మధ్యప్రదేశ్‌ తుపాకీ తయారీదారి గ్యాంగ్‌ బాగోతం కూడా బయటపడింది. వాళ్లను కూడా అరెస్ట్‌ చేసి ఏపీ పోలీస్‌ తడాఖా ఏంటో చూపారు ఎస్పీ ఫకీరప్ప అండ్‌ టీమ్‌.

బిగ్‌ రాకెట్‌ను బ్రేక్‌ చేసిన అనంతపురం పోలీసుల్ని, ఎస్పీ ఫకీరప్పను అభినందించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఇది మాములు కేసు కాదు. ఈ గ్యాంగ్‌ సామాన్యమైంది కాదు. కర్నాటక, ఏపీ, గోవా సహా మరెన్నో చోట్ల నేరాలకు పాల్పడ్డారు. సుపారీ పడేస్తే చాలు దేనికైనా రెడీ. మర్డర్లకు, కిడ్నాప్‌లకు దేనికీ వెనుకాడరు. దొంగ పనిలో దొంగ పనిగా బళ్లారి అడ్డాగా నకిలీ కరెన్సీ దందాతో పేట్రాగారు. కూపీలాగితే గోవా రియాజ్‌ క్రైమ్‌ డేటా బయటపడింది. వాడిని టచ్‌ చేస్తే బెంగళూరు బేవార్స్‌గాళ్ల సినిమా తెరపైకి వచ్చింది. జంషీద్‌ అండ్‌ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే.. మధ్యప్రదేశ్లో రాజ్‌పాల్‌ సింగ్‌ ఆయుధ డొంక కదిలింది.

ఇలా కర్నాటక జంషీద్‌ గ్యాంగ్‌ సహా అటు మధ్యప్రదేశ్‌ రాజ్‌పాల్‌ సింగ్‌ ముఠా.. అనంతపురం పోలీసుల ఆపరేషన్‌కు అడ్డంగా బుక్కయ్యారు. 18 డెడ్లీ వెపన్స్‌.. 95 రౌండ్ల బుల్లెట్లు.. మ్యాగజైన్లు.. ఇవన్నీ ఓ లెక్క.. అధునాతన బెరెట్టా అంటే 15 రౌండ్లతో 9 MM సెమీ ఆటోమేటిక్ పిస్టల్ మరోలెక్క. వీటితో ఈ ముఠా ఎక్కెడెక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు? ఈ ఆయుధాలు ఇంకా ఎవరెవరికి సరఫరా అయ్యాయి? వైడ్‌ యాంగిల్‌లో విచారణ చేపట్టారు. నిందితుల కస్టడీలో మరిన్ని బిగ్‌ బ్రేకింగ్స్‌ ఖాయమని తెలుస్తోంది. ఈ ముఠాతో అంటకాగిన వాళ్ల గుండెల్లో ఇక రైళ్లే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us