eKYC in AP: వాలంటీర్ వద్ద, రేషన్ షాపు వద్ద కూడా ఈ-కేవైసీ.. గడువుపై కూడా పూర్తి క్లారిటీ ఇదిగో

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రేషన్ కార్డు ద్వారా కార్డుదారులు దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులను తీసుకునే హక్కు...

eKYC in AP: వాలంటీర్ వద్ద, రేషన్ షాపు వద్ద కూడా ఈ-కేవైసీ.. గడువుపై కూడా పూర్తి క్లారిటీ ఇదిగో
Ekyc
Follow us

|

Updated on: Aug 19, 2021 | 7:22 PM

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రేషన్ కార్డు ద్వారా కార్డుదారులు దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులను తీసుకునే హక్కు పొందడం కోసం బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని చేశారు. అయితే ఈ-కేవైసీ కోసం బియ్యం కార్డుదారులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతి గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా కానీ లేదా రేషన్ షాప్ డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం ద్వారా కానీ బియ్యం కార్డు దారులు తమ నివాస ప్రాంతాల్లోనే సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ తెలిపినట్లు గురువారం నాడు విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన ద్వారా రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ వివరించారు.

ఈ-కేవైసీ కోసం ఆధార్ కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారని, గడువు ముగుస్తోందని, బియ్యం కట్ అని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఈ-కేవైసీ పై ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పించే సంకల్పంతో, ఈ-కేవైసీ పై బియ్యం కార్డుదారులకు ఉన్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేసే విధంగా కోన శశిధర్ ఈ-కేవైసీ పై తెలిపిన అంశాలపై సంగ్రహ సమాచారంతో ఐ&పీఆర్ కమీషనర్ పత్రికా ప్రకటన విడుదల చేసారు.

ఈ-కేవైసీ( eKYC) అంటే ఏమిటి?

# కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రాష్ట్రంలోని బియ్యంకార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు/సభ్యురాలు ఈ-కేవైసీ చేయించుకోవాలి

# బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ యంత్రం ద్వారా వారి వేలిముద్రలతో ఆధార్ నెంబర్ ను ధ్రువీకరించుకునే సింపుల్ ప్రక్రియ ఈ-కేవైసీ

ఈ-కైవైసీ వల్ల ప్రయోజనాలేమిటి?

# కేంద్ర ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ-కేవైసీ చేయించుకున్న బియ్యంకార్డు/నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు కార్డుదారులు పోర్టబిలిటీ సదుపాయం ద్వారా ప్రతి సభ్యులు వ్యక్తిగతంగా నిత్యావసర రేషన్ సరుకులను దేశంలో ఎక్కడినుండైనా పొందే హక్కు కలుగుతుంది. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడానికి కూడా వీలు కలుగుతుంది.

ఈ-కేవైసీ ని ఎక్కడ..ఎవరితో..ఎలా చేయించుకోవాలి?

# ఈ-కేవైసీ ప్రక్రియను చాలా సులభతరంగా…మీ గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా చేయించుకోవచ్చు

# లేదా మీ చౌక ధరల దుకాణపు డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్(ePOS) యంత్రం ద్వారానైనా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు

# వేలి ముద్రలు సరిగా పడని వారు వారి చౌక ధరల దుకాణం వద్ద ఈ-పోస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్( FUSION FINGER) సదుపాయాన్ని వినియోగించుకుని ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తీ చేసుకోవచ్చు

# వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం వద్ద కానీ లేదా చౌక ధరల దుకాణం వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం వద్ద కానీ ఈ-కేవైసీ ఫెయిల్ అయిన వారు మరియు ఇదివరకు బయోమెట్రిక్ రికార్డు కాని వారు మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాల వద్దకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవచ్చు

# ఈ-కేవైసీ చేయించుకోవాల్సిన వారిలో దాదాపు 80 శాతం మంది గ్రామ/వార్డు వాలంటీర్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవచ్చు

ఈ-కేవైసీ ఎవరికి అవసరం..ఎంత గడువులోపు పూర్తీ చేయించుకోవాలి?

# బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలి

# అయితే 0-5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ-కేవైసీ అవసరం లేదు

# 5 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న వారికి వచ్చే నెల సెప్టెంబర్ ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలి

# మిగిలిన వయసు వారు ఈనెల ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలి

# పరిస్థితిని బట్టి గడువు పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది

ఆధార్ నమోదు కేంద్రాలుగా గ్రామ/వార్డు సచివాలయాలను గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2102 ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

బియ్యం కార్డుల రద్దుపై అనుమానాలు..అపోహలు వద్దు

# ఈ-కేవైసీ ప్రక్రియ బియ్యం కార్డులను తొలగించే ప్రక్రియ కాదు – ఇది కేవలం ఆధార్ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ మాత్రమే

#కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు బియ్యం కార్డులో ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి సభ్యునికీ/సభ్యురాలికీ నిరంతరాయంగా రేషన్ సరుకులను యథావిధిగా సరఫరా చేయడం జరుగుతుందని, అపోహలను, అనుమానాలను విడనాడి, పుకార్లను నమ్మకుండా బియ్యం కార్డుదారుల్లో అక్కడక్కడా ఇంకా ఈ-కేవైసీ చేసుకోని వారు ఎవరైనా ఉంటే పైన తెలిపిన గడువు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు.

Also Read: ఫీమేల్ స్టూడెంట్స్‌తో కలిసి బస్సులో ప్రయాణించిన ఎస్పీ దీపికా పాటిల్.. అందుకోసం స్వయంగా రంగంలోకి

Bandla Ganesh: ‘మా’ బిల్డింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేశ్..

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్