AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Boat Accident : గోదావరిలో బోటు మునిగింది అందుకేనా?

గోదావరిలో మునిగిపోయిన బోటు ప్రమాదానికి పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. పాపికొండల యాత్ర అంటే గోదావరి ప్రవాహానికి ఎదురు వెళ్లడమే. అయితే ఇది అక్కడి ప్రజలకు సర్వసాధారణం. కానీ టూరిస్టు బోట్లలో పర్యాటకులను తీసుకువెళ్లే లాంచీలు ఈ రూట్లో అన్నీఅనేకం తిరుగుతూ ఉంటాయి. వీటిలో ప్రైవేటు బోట్లతో పాటు ప్రభుత్వానికి చెందిన పర్యాటక శాఖ బోట్లు కూడా ఉంటాయి. ప్రధానంగా ఆదివారం జరిగిన బోటు […]

Godavari Boat Accident : గోదావరిలో బోటు మునిగింది అందుకేనా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2019 | 8:24 PM

Share

గోదావరిలో మునిగిపోయిన బోటు ప్రమాదానికి పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. పాపికొండల యాత్ర అంటే గోదావరి ప్రవాహానికి ఎదురు వెళ్లడమే. అయితే ఇది అక్కడి ప్రజలకు సర్వసాధారణం. కానీ టూరిస్టు బోట్లలో పర్యాటకులను తీసుకువెళ్లే లాంచీలు ఈ రూట్లో అన్నీఅనేకం తిరుగుతూ ఉంటాయి. వీటిలో ప్రైవేటు బోట్లతో పాటు ప్రభుత్వానికి చెందిన పర్యాటక శాఖ బోట్లు కూడా ఉంటాయి. ప్రధానంగా ఆదివారం జరిగిన బోటు ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు.

ఆదివారం ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటును స్థానికేతరులైన నూకరాజు, తామరాజు అనే డ్రైవర్లు నడిపారు. వీరిద్దరూ ఈ మార్గానికి కొత్తవారేనని తెలుస్తోంది. వీరికి నదిలో ఎక్కడ సుడులు, లోతు ఉంటాయో వంటి అంశాలపై సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణం.

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, అంటే ఎగువనుంచి కిందికి 4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నసమయంలో బోటును తీసుకెళ్లడం కూడా ఈ ప్రమాదానికి కారణం. రాయల్ వశిష్ఠ బోటులో ఒకే ఇంజిన్ ఉంది. నిబంధనల ప్రకారం 20 మంది కంటే అధికంగా ప్రయాణికులు ఉంటే ఆ బోటుకు రెండు ఇంజిన్లు ఉండితీరాలి. కానీ ఈ బోటును ఒకే ఒక్క ఇంజన్‌తో నడిపిస్తున్నారు. అయితే ఈ బోటులో రెండో ఇంజన్ ఉన్నప్పటికీ పాడైపోయిన దాన్ని అలంకార ప్రాయంగా ఉంచడం బోటు నిర్వాహకుల కాసుల కక్కుర్తికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇవన్నీఇలా ఉంచితే బోటు మునిగిపోయే సమయంలో ప్రాణాలను దక్కించుకోడానికి  అందులో ఉన్న జనం భయంతో ఒక వైపు పరుగులు పెట్టడం కూడా ఈ ఘోర దుర్ఘటనకు మరో కారణం. ప్రయాణికులంతా ఒకవైపునకు రావడంతో బోటు మరోవైపునకు ఒరిగిపోయింది.

గోదావరిలో పదుల సంఖ్యలో మృత్యుఒడికి చేరుకోడానికి కారణమైన రాయల్ వశిష్ఠ వంటి బోట్లు ఇంకా అనేకం ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పడు పరిశీలించాల్సిన అధికారులు వీటిని నిబంధనల ప్రకారం తనిఖీలు చేయకపోవడం కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం. ఈ దారుణ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

Follow Us
మరణానికి ముందు మనిషికి ఏమి కనిపిస్తుంది? గరుడ పురాణం రహస్యాలు
మరణానికి ముందు మనిషికి ఏమి కనిపిస్తుంది? గరుడ పురాణం రహస్యాలు
మిథునం సినిమా బడ్జెట్ కోటి రూపాయలు.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..
మిథునం సినిమా బడ్జెట్ కోటి రూపాయలు.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఎన్ని రోజులంటే..?
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఎన్ని రోజులంటే..?
ఇంట్లోనే కొబ్బరినూనెను ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి
ఇంట్లోనే కొబ్బరినూనెను ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి
తెలుగు అభిమానుల గురించి తమిళ హీరో కామెంట్స్ వింటే గూస్ బంప్స్
తెలుగు అభిమానుల గురించి తమిళ హీరో కామెంట్స్ వింటే గూస్ బంప్స్
ఒంటరితనమే మిన్న అంటున్న నేటి తరం మహిళలు!
ఒంటరితనమే మిన్న అంటున్న నేటి తరం మహిళలు!
తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అందరికీ ఉచితంగా బ్రేక్ ఫాస్ట్
తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అందరికీ ఉచితంగా బ్రేక్ ఫాస్ట్
హఠాత్తుగా బరువు తగ్గడంతో బాడీకి కలిగే 7 నష్టాలు
హఠాత్తుగా బరువు తగ్గడంతో బాడీకి కలిగే 7 నష్టాలు
సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్ ఛాన్స్ లేదు.. బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్
సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్ ఛాన్స్ లేదు.. బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్
రా మ్యాంగో చీర, ఎమరాల్డ్ జ్యువెలరీలో అదిరిపోయిన నోరా లుక్
రా మ్యాంగో చీర, ఎమరాల్డ్ జ్యువెలరీలో అదిరిపోయిన నోరా లుక్