Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా […]

Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!
Follow us

|

Updated on: Sep 16, 2019 | 10:14 AM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. సీఎం కేసీఆర్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

ఆచూకీ తెలిసిన వారి వివరాలు:-

1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం. 2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం. 4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి 5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.

ఆచూకీ తెలియని వారి వివరాలు:-

1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం. 3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం. 4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం 5) గడ్డమీది సునీల్ , 40 సం. 6) కొమ్ముల రవి , 43 సం 7) బసికె రాజేందర్ ,58 సం 8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17 సం 9 ) .గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.

గల్లంతైన హైదరాబాద్ వాసులు:-

1.సాయి కుమార్ 2.రాజేష్ 3.అబ్దుల్ సలీమ్ 4.మహేశ్వర్ రెడ్డి

మిగిలిన ప్రాంతాల వారి వివరాలు:-

1.జెమిని రామారావు(రాజమండ్రి)

2. మురళీ(విశాఖపట్నం)

3.సన్నీ(విశాఖ)

4.కేవీఆర్(విశాఖ)

5. గుత్తుల ప్రకాశ్‌, కిన్నెపల్లి వాసుబాబు విష్ణుకుమార్‌, వి.రఘురామ్‌( మారుతీ ట్రావెల్స్‌ ద్వారా)

6.జగన్నాథ్‌ (రాజోలు)

7.రమణ (విశాఖ)

కాగా ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభించాయి. 20 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.