AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో నలుగురు మంత్రులకు ఉద్వాసన? జగన్ సంచలన నిర్ణయం..నిజమా?

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి దాదాపు నెలన్నర అవుతోంది. ఇంకా కేబినెట్ పూర్తిగా కుదురుకోలేదు.. అప్పుడే కొంతమంది మంత్రులను తప్పించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అవినీతి రహిత పాలనే తమ లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. అవినీతి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే వారిని కేబినెట్ నుంచి తప్పించడానికి రంగం సిద్ధం చేశారని సమాచారం. సీఎం జగన్ మొదటి నుంచి తమ హయాంలో అవినీతి అన్నది సహించేది లేదని.. తన పార్టీ నేతలు అవినీతికి పాల్పడిన వారిపై […]

ఏపీలో నలుగురు మంత్రులకు ఉద్వాసన? జగన్ సంచలన నిర్ణయం..నిజమా?
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 11, 2019 | 4:12 PM

Share

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి దాదాపు నెలన్నర అవుతోంది. ఇంకా కేబినెట్ పూర్తిగా కుదురుకోలేదు.. అప్పుడే కొంతమంది మంత్రులను తప్పించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అవినీతి రహిత పాలనే తమ లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. అవినీతి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే వారిని కేబినెట్ నుంచి తప్పించడానికి రంగం సిద్ధం చేశారని సమాచారం.

సీఎం జగన్ మొదటి నుంచి తమ హయాంలో అవినీతి అన్నది సహించేది లేదని.. తన పార్టీ నేతలు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే కొంతమంది మంత్రులు మాత్రం ఎన్నికల సమయంలో ఖర్చైన డబ్బును రాబట్టే క్రమంలో కాంట్రాక్టుల వైపు మళ్లారని జగన్‌కు పక్కాగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీనితో వారిపై చర్యలు తీసుకోవడానికి సీఎం ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉందని సమాచారం. ఆమెకు మంత్రి పదవి దక్కడంపై అప్పట్లో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై వాస్తవం ఏంటి.. లేక వట్టి పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వదంతులు ‘కాక’ రేపుతున్నాయి.